PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan 24th Installment: దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఇప్పటికే 23వ విడత జూన్లో విడుదలైన నేపథ్యంలో, తదుపరి 24వ విడత అక్టోబర్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దుర్గా పూజకు ముందే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈసారి కొందరు అర్హులైన రైతులకు రూ.2,000కు బదులుగా రూ.4,000 జమయ్యే అవకాశం ఉంది. గత 23వ విడతలో ఇ-కేవైసీ, భూమి ధృవీకరణ లేదా ఇతర పత్రాల సమస్యల కారణంగా చెల్లింపు ఆలస్యమైన రైతులకు ఈ అవకాశం ఉంటుంది.
ఇలాంటి రైతులు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని ధృవీకరణ పూర్తి చేసుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పేర్లను ఆమోదం కోసం పంపుతాయి. పేర్లు ఆమోదం పొందితే గత 23వ విడతకు సంబంధించిన బకాయి రూ.2,000తో పాటు 24వ విడత రూ.2,000 కలిపి మొత్తం రూ.4,000 అందే అవకాశం ఉంది. అయితే 23వ విడతను ఇప్పటికే సకాలంలో పొందిన రైతులందరికీ రూ.4,000 రాదు. వారికి 24వ విడత కింద సాధారణంగా రూ.2,000 మాత్రమే లభిస్తుంది. బకాయి విడతలు ఉన్న రైతులు ఇ-కేవైసీ, ల్యాండ్ సీడింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకోవడం ద్వారా తదుపరి విడతతో పాటు పెండింగ్ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Also Read
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
పీఎం కిసాన్ విడత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులు తమ విడత, అర్హత, ఇ-కేవైసీ స్థితిని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించాలి. హోమ్పేజీలోని ‘Farmers Corner’ విభాగంలో ‘Know Your Status’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ను నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. అనంతరం మీ విడత చెల్లింపు, ఇ-కేవైసీ తదితర వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!