Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
- సన్న వడ్లకు భారీ బోనస్
- వెయ్యి రోజుల పాలనపై పొంగులేటి
- బీఆర్ఎస్ అప్పులపై మంత్రి ఫైర్
- ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల పాలన అత్యంత విజయవంతమైందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాలను సమతుల్యం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సన్న వడ్ల కొనుగోలుపై క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ను మించి రాష్ట్రంలో వరి దిగుబడి సాధించామని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పటికీ తెలంగాణ రైతాంగం ఈ రికార్డును నెలకొల్పడం గర్వకారణమని కొనియాడారు.
అప్పుల బారిన పడేసినా భేషజాలకు పోకుండా సంక్షేమం
గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని తమ నెత్తిన పెట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. అయినా సరే, భేషజాలకు పోకుండా గతంలో ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. నిలిచిపోయిన రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులతో పాటు సర్పంచ్లకు సంబంధించిన పాత బాకీలను సైతం తమ ప్రభుత్వమే చెల్లించిందని వివరించారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని, ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
Also Read
- Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
- KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు స్పందన
బిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలూ ఒక్కటేనని, అవి బహిరంగంగా జతకట్టినా ప్రజలు ఆమోదించరని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్కే పట్టంగట్టారని గుర్తుచేశారు. బతుకమ్మ చీరల పంపిణీలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడితే, తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి కానుకగా ‘పాలపిట్ట చీరల’ను ఆడబిడ్డలకు అందించిందని, త్వరలోనే ‘చిలకపచ్చ చీరల’ను పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!