Telangana Rising : సమ్మిట్ కు భారీ బందోబస్తు.. వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత
- సమ్మిట్ కు భారీ బందోబస్తు
- టి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కమిటీ సభ్యులతో సిపి సమీక్ష సమావేశం
- వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత
- వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
- సుమారు 2,500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం, మిర్ఖాన్ పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ బందోబస్త్ కల్పిస్తోంది. ఈరోజు మహేశ్వరంలో బందోబస్త్ మీద రాచకొండ సిపి సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ICC ఏండి శశాంక్ మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి ట్రాఫిక్ డీసీపీలతో కలిసి టి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కమిటీ సభ్యులతో, వివిధ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వారినుండి పోలీసు శాఖకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, పోలీసు శాఖ నుండి వారికి ఎలాంటి సహాయ సహకారాలు ఇవ్వాలి అనేదానిపై నిర్వాహక కమిటీ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సుకు సుమారు 2,500 మంది పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తునందున లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్స్తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read
ఈ సమ్మిట్ కి కావాల్సిన సదుపాయాలపై, బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయల గురించి అధికారులతో చర్చించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల ప్రతినిధులు, బహుళ సంస్థల అధినేతలు, దేశీయ సంస్థల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో కలిపి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు.
వీరి సహాయక సిబ్బంది సుమారు మూడు వేల మంది రానున్నారు. వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెట్టేందుకు సుమారు వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ పోలీసు కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉంటాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నారు. రహదారుల మళ్లింపు, రూట్ మ్యాప్ లు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి వాటి కోసం ట్రాఫిక్ మార్షల్స్ నియమించుకోనున్నారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు జరగకుండా ఆయా మార్గాలను పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. సాధారణ ప్రజలు, వాహనదారులకు రెండు రోజుల పాటు ఆయా మార్గాలలో రహదారుల మళ్లింపులు ఉంటాయి. మహిళా పారిశ్రామికవేత్తలు, వక్తల, పెట్టుబడిదారుల భద్రత, రక్షణ కోసం ఉమెన్స్ వింగ్, షీ టీమ్స్ ప్రత్యేకంగా వింగ్ నీ ఏర్పాటు చేశారు.
Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!