Telangana Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా
- పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా
- 850 సర్పంచ్ స్థానాల్లో విజయాలు
- ఏకగ్రీవ స్థానాల్లో కూడా కాంగ్రెస్దే పైచేయి
- శాంతి భద్రతతో కొనసాగుతున్న కౌంటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి తమ హవాను చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా, వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 850 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుని, 80% స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 350 స్థానాలు, బీజేపీ 60 స్థానాలు, ఇతరులు 150 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ నాయకులు దీనిని ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదంగా అభివర్ణించారు.
Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్
Also Read
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Hyderabad: స్విట్జర్లాండ్కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
పోలింగ్ జరిగిన స్థానాలతో పాటు, ఎన్నికలు ఏకగ్రీవమైన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే పైచేయిగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకగ్రీవమైన 45 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 32 స్థానాలను దక్కించుకుంది. నల్గొండ జిల్లాలో 17, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి జిల్లాలో 10 ఏకగ్రీవ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయ డంకా మోగించారు.
మొదటి విడతలో 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగ్గా, కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. బ్యాలెట్ పత్రాల లెక్కింపు మ్యాన్యువల్గా జరుగుతున్నందున, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఫలితాలు వెల్లడికావడానికి కొంత ఆలస్యం అవుతోంది. ఏదేమైనా, ఎంత ఆలస్యమైనా ఈరోజే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో దాదాపు 79.15% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Droupadi Murmu : ఈనెల 17న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తాజావార్తలు
-
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
-
Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
-
BCCI Trolls: పర్ఫామెన్స్కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!
-
Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
-
Iran War: ట్రంప్ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్పై దాడి చేసిందా?
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!