కరోనా మహమ్మారి కాలంలో నేతన్నలకు రూ.109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు తెలంగాణ పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖా మంత్రి కేటీఆర్.. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన ఆయన.. ఈ పథకం ద్వారా కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వెల్లడించారు.. గత ఏడాది కరోనా నేపథ్యంలో లాకిన్ గడువు కన్నా ముందే నిధులు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్న ఆయన.. ఈ పథకం పునః ప్రారంభం ద్వారా రాష్ర్టంలోని సూమారు 34 వేల మంది నేతన్నలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుడు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను 16 శాతం ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. దీంతోపాటు మరమగ్గ కార్మికులు చేసే 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో 8 శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తుందని వివరించారు.. రాష్ట్రంలో ఉన్న సుమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు పథకం భరోసాను ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్.