Ramoji Rao: నేడు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramoji Rao: నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read also: Modi Oath ceremony: అర్థరాత్రి వరకు అమిత్ షా, నడ్డా మేధోమథనం.. వరుగా కాబోయే మంత్రులకు ఫోన్స్
Also Read
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీ అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నానక్ రాంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. రామోజీరావు మృతికి సంతాపంగా ఆది, సోమవారాలను ఏపీ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. అలాగే రామోజీ మృతికి నివాళిగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్లను నిలిపివేయాలని నిర్మాత మండలి నిర్ణయించింది.
Read also: Modi Oath ceremony: అర్థరాత్రి వరకు అమిత్ షా, నడ్డా మేధోమథనం.. వరుగా కాబోయే మంత్రులకు ఫోన్స్
రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో జరగనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి పరిశీలించారు. రామోజీరావు అంత్యక్రియలకు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
రామోజీరావు అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్స్ సిటీ ప్రతినిధులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం చంద్రబాబు, చిరంజీవి, పవన్లయన్, లోకేష్, రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం తదితర ప్రముఖులు రామోజీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ్లను ఏపీ ప్రభుత్వం పంపుతోంది.
తాజావార్తలు
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!