కరోనా మృతుల కుటుంబాలకు అలర్ట్… తెలంగాణ సర్కారు కొత్త ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేలు పరిహారం ఇస్తోంది. గత ఏడాది నవంబరులో తొలి విడతలో 3,870 దరఖాస్తులు రాగా డిసెంబరులో వాటిని ఆమోదించి ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇంకా బాధిత కుటుంబాలు ఉంటే పరిహారం అందుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. బాధిత కుటుంబాలు పరిహారం కోసం మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విప్తతు నిర్వహణ శాఖ సూచించింది.
Read Also: తెలంగాణ బీజేపీ ఎంపీపై అట్రాసిటీ కేసు
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
దరఖాస్తు సమయంలో బాధిత కుటుంబాలకు చెందిన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను అందజేయాల్సి ఉంటుందని తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ సూచనలు జారీ చేసింది. చనిపోయినట్లు ధ్రువీకరించే డెత్ సర్టిఫికెట్, మరణానికి కోవిడ్ కారణమని తెలిపే డాక్యుమెంట్ లేదా కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ పరీక్షకు సంబంధించిన పత్రం, ఆధార్ కార్డు వివరాలు దరఖాస్తు సమయంలో సమర్పించాలని కోరింది. ఆయా దరఖాస్తులను జిల్లా స్థాయిలో నియమించిన కమిటీ పరిశీలిస్తుందని… వారు నిర్ధారించిన తర్వాత పరిహారం మంజూరు అవుతుందని వివరించింది. వివరాలకు 040-48560012 నంబరులో కాల్ చేయవచ్చని పేర్కొంది.

తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..