KCR Govt: ఇమామ్లు, మౌజంలకు గుడ్న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Govt: మరికొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే దూకుడు పెంచాయి. గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ, బంజరు భూమి పట్టాల పంపిణీ, రైతు బంధు వంటి కార్యక్రమాలు చేపట్టారు. రైతు రుణమాఫీ, రూ.లక్ష సాయం, మైనార్టీలకు గృహలక్ష్మి పథకాల అమలుకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని రూపొందించారు. తాజాగా రాష్ట్రంలోని మరో 7,005 మంది ఇమామ్ లు, మౌజమ్ లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్లు, మౌజామ్ల లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
Read also: Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది మౌజమ్లు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 7 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని.. అన్నింటికి రేపు సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇస్తామని ఆదివారం జరిగిన సమావేశాల్లో వెల్లడించారు. హిందూ దేవాలయాల్లో పూజలు చేసే పూజారులకు ఇచ్చే విధంగా మౌజమ్లు, ఇమామ్లకు కూడా అందజేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం మాట ప్రకారం.. మరో 7,005 మంది మౌజమ్లు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 9,995 మంది ఇమామ్ లు, మౌజామ్ లు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం పొందుతుండగా, కొత్తగా చేరిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్ లు, మౌజమ్ ల సంఖ్య 17 వేలకు చేరింది. ఈ పథకం కింద మసీదుల ఇమామ్లు, మౌజమ్లకు రూ. 1000 గౌరవ వేతనం ఇచ్చేవారు ఆతరువాత.. 1500 ఆపై రూ. 5,000 పెంచడంతో ఇమామ్లు, మౌజంలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..