KCR Govt: ఇమామ్లు, మౌజంలకు గుడ్న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Govt: మరికొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే దూకుడు పెంచాయి. గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ, బంజరు భూమి పట్టాల పంపిణీ, రైతు బంధు వంటి కార్యక్రమాలు చేపట్టారు. రైతు రుణమాఫీ, రూ.లక్ష సాయం, మైనార్టీలకు గృహలక్ష్మి పథకాల అమలుకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని రూపొందించారు. తాజాగా రాష్ట్రంలోని మరో 7,005 మంది ఇమామ్ లు, మౌజమ్ లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్లు, మౌజామ్ల లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
Read also: Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?
Also Read
- NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది మౌజమ్లు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 7 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని.. అన్నింటికి రేపు సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇస్తామని ఆదివారం జరిగిన సమావేశాల్లో వెల్లడించారు. హిందూ దేవాలయాల్లో పూజలు చేసే పూజారులకు ఇచ్చే విధంగా మౌజమ్లు, ఇమామ్లకు కూడా అందజేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం మాట ప్రకారం.. మరో 7,005 మంది మౌజమ్లు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 9,995 మంది ఇమామ్ లు, మౌజామ్ లు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం పొందుతుండగా, కొత్తగా చేరిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్ లు, మౌజమ్ ల సంఖ్య 17 వేలకు చేరింది. ఈ పథకం కింద మసీదుల ఇమామ్లు, మౌజమ్లకు రూ. 1000 గౌరవ వేతనం ఇచ్చేవారు ఆతరువాత.. 1500 ఆపై రూ. 5,000 పెంచడంతో ఇమామ్లు, మౌజంలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు
తాజావార్తలు
-
Prashant Kishor: బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. ప్రభుత్వానికి, ఆర్జేడీకి కొత్త తలనొప్పి..!
-
Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
-
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!