IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I-T Returns Filed: భారతదేశంలో పన్ను చెల్లింపు దారుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత ఈ సంఖ్య మరింత పెరుగతోందని ఐటీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపు దారుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నట్టు ఐటీ శాఖ లెక్కలో బయటపడుతోంది. లక్షాధికారుల సంఖ్య కంటే కూడా కోటీశ్వరుల సంఖ్యనే వాటిలో ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాగే పన్ను చెల్లింపుదారుల సంఖ్య కరోనా తరువాత బాగా పెరిగినట్టు ఐటీ శాఖ రిటర్న్స్ లో బయటపడింది. కరోనా తరువాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతోపాటు.. ఐటీ రిటర్న్స్ రూపంలో వస్తున్న ఆదాయం కూడా పెరిగింది.
Read also: Rajya Sabha: డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్పై రాజ్యసభలో హైడ్రామా.. చివరకు..
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ 2018-19 తో పోల్చితే ఆర్థిక 49.4 శాతం పెరిగింది. ఇది కాస్త 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. అయితే రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఈ మధ్య కాలంలో 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షల మంది ఉంటే.. 2021-22 ఏడాదికి 1.93 లక్షల మంది కాగా.. అదే 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.80 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఐటీ రిటర్న్స్ లో రూ. 5 లక్షలు లోపు ఆదాయ ఉన్న వారిలో పన్ను చెల్లింపు దారుల్లో 0.6 శాతం మాత్రమే పెరిగినట్టు ఐటీ శాఖ ప్రకటించిన లెక్కలు చెబుతున్నాయి. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 4.94 కోట్ల మంది గత ఏడాది పన్ను చెల్లింపు చేయగా.. అదికాస్త ఈ ఏడాది 5.68 కోట్ల మందికి పెరిగింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు గత ఏడాది 1.90 లక్షల ఉండగా.. ఈ ఏడాది 1.46 లక్షల మందికి పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయం వచ్చే వారు.. అలాగే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్స్ తగ్గుతున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!