IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I-T Returns Filed: భారతదేశంలో పన్ను చెల్లింపు దారుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత ఈ సంఖ్య మరింత పెరుగతోందని ఐటీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపు దారుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నట్టు ఐటీ శాఖ లెక్కలో బయటపడుతోంది. లక్షాధికారుల సంఖ్య కంటే కూడా కోటీశ్వరుల సంఖ్యనే వాటిలో ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాగే పన్ను చెల్లింపుదారుల సంఖ్య కరోనా తరువాత బాగా పెరిగినట్టు ఐటీ శాఖ రిటర్న్స్ లో బయటపడింది. కరోనా తరువాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతోపాటు.. ఐటీ రిటర్న్స్ రూపంలో వస్తున్న ఆదాయం కూడా పెరిగింది.
Read also: Rajya Sabha: డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్పై రాజ్యసభలో హైడ్రామా.. చివరకు..
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ 2018-19 తో పోల్చితే ఆర్థిక 49.4 శాతం పెరిగింది. ఇది కాస్త 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. అయితే రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఈ మధ్య కాలంలో 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షల మంది ఉంటే.. 2021-22 ఏడాదికి 1.93 లక్షల మంది కాగా.. అదే 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.80 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఐటీ రిటర్న్స్ లో రూ. 5 లక్షలు లోపు ఆదాయ ఉన్న వారిలో పన్ను చెల్లింపు దారుల్లో 0.6 శాతం మాత్రమే పెరిగినట్టు ఐటీ శాఖ ప్రకటించిన లెక్కలు చెబుతున్నాయి. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 4.94 కోట్ల మంది గత ఏడాది పన్ను చెల్లింపు చేయగా.. అదికాస్త ఈ ఏడాది 5.68 కోట్ల మందికి పెరిగింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు గత ఏడాది 1.90 లక్షల ఉండగా.. ఈ ఏడాది 1.46 లక్షల మందికి పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయం వచ్చే వారు.. అలాగే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్స్ తగ్గుతున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!