DGP Shivadhar Reddy :FSL ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేస్తున్నాం..
- FSL ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేస్తున్నాం
- ఏసీబీ కేసు 2015లో ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించాం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని పరిశీలించి నివేదికలు ఇచ్చాం
- సర్వర్ రూంలు పూర్తిగా కాలిపోయాయి
- సాంకేతిక నిపుణులతో రీట్రీవ్ చేస్తున్నాం
- ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు బ్యాకప్ లేదు: డీజీపీ శివధర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana FSL Fire Accident : తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయనే అనుమానాల నేపథ్యంలో, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, కేసుల విచారణ ఏ దశలో ఉందనే విషయాలపై ఆయన స్పష్టతనిచ్చారు.
Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
ఈ అగ్నిప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్ లోని సర్వర్ రూమ్లు పూర్తిగా కాలిపోయాయని డీజీపీ వెల్లడించారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ సర్వర్లకు ఎటువంటి బ్యాకప్ వ్యవస్థ అందుబాటులో లేదు. “సర్వర్ రూమ్ పూర్తిగా దగ్ధమైంది. డేటా బ్యాకప్ లేకపోవడం వల్ల కొంత సమాచారం కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, ప్రస్తుతం సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగి, కాలిపోయిన సర్వర్ల నుండి డేటాను తిరిగి వెలికితీసే (Retrieve) ప్రయత్నాలు చేస్తోంది” అని ఆయన వివరించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో కొన్ని కీలక కేసుల ఆధారాలు మాయమయ్యాయనే ప్రచారాన్ని డీజీపీ కొట్టిపారేశారు. ముఖ్యంగా 2015 నాటి ఏసీబీ కేసుల (ఓటుకు నోటు వంటివి) గురించి ప్రస్తావిస్తూ, ఆ కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాము 2021లోనే కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు. అందువల్ల ఇప్పుడు జరిగిన ప్రమాదానికి, ఆనాటి కేసుల ఆధారాలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా ఆయన స్పందించారు. ఈ కేసులో కావాల్సిన అన్ని అంశాలను ఇప్పటికే నిశితంగా పరిశీలించామని, దానికి సంబంధించిన నివేదికలను ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశామని తెలిపారు.
కొత్త కలర్, స్పోర్టీ స్టైల్, భారీ తగ్గింపు ధరతో 2026 Aprilia RS 457, Tuono 457 బైక్స్ లాంచ్.!
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!