Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు జలసమాధి అయ్యారు. మృతులందరూ బలవంతపూర్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంలో బలవంతపూర్ వాసి రాజు (35), ఆయన భార్య భాగ్య (22), వారి ఐదేళ్ల కుమారుడు నియాన్ష్, మూడేళ్ల కుమార్తె శాన్విక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటలో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఇటీవల జరిగిన దశదిన కర్మ కార్యక్రమానికి రాజు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. వేడుక ముగించుకుని రాత్రి సమయంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అర్థరాత్రి దాటినా వారు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాజు , ఆయన భార్య భాగ్య ఫోన్లకు వరుసగా కాల్స్ చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అని రావడంతో అనుమానం వచ్చిన బంధువులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- 2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అప్పనపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఒక కారు మునిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. వాహనం లోపల పరిశీలించగా నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకట్లో డ్రైవింగ్ చేస్తుండగా అదుపు తప్పి కారు నేరుగా బావిలోకి దూసుకెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారి పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో బలవంతపూర్ , అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. చిన్నపిల్లల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదం జరిగిన తీరుపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
-
BCCI Partners: బీసీసీఐతో చాట్జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
ట్రెండింగ్
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!