Telangana : ఖమ్మంలో ఘోర ప్రమాదం..కాళ్ల పారాణి ఆరకముందే కబలించిన మృత్యువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృత్యువు ఎప్పుడు ఎలా.. ఎక్కడ వస్తుందో చెప్పడం కష్టం.. ఆ సమయం వస్తే మనం గుడిలో ఉన్నా కూడా గుండె ఆగుతుందని పెద్దలు చెబుతున్నారు.. తాజాగా జరిగిన ఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.. జీవితంలో మరో అడుగు వేసిన ఓ యువతి కొత్తగా ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. కానీ మృత్యువు ఆమె సంతోషాన్ని ఓర్వలేక తీసుకెళ్లిపోయింది..కాళ్ల పారాణి ఆరకముందే కబలించివేసింది.. పెళ్ళైన కొద్ది రోజులకు రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..
సరదాగా భర్తతో కలసి కు వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలను పోగొట్టుకుంది నవ వధువు. కారు ప్రమాదంలో గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాధ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…ఖమ్మం పట్టణ శివారు టేకులపల్లి కి చెందిన సంధ్యకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయింది. సంధ్య తన భర్తతో కలిసి నందిగామ మండలం కొంతమత్కూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ సరదాగా సినిమా చూద్దామని భావించిన ఈ దంపతులు రాత్రి ద్విచక్ర వాహనం బుల్లెట్పై చూసేందుకు మధిరకి బయలుదేరారు.. అంతే అదే వారిద్దరి జీవితంలో చివరి ప్రయాణం..
Also Read
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
అయితే దారి మధ్యలోనే ప్రమాదం జరిగింది..ఎదురుగా వస్తున్న కారు వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంధ్య తీవ్రంగా గాయపడింది. తలకి బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. సంధ్య భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఐదు నెలల క్రితమే పెళ్ళై కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన సంధ్య.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఇరు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు… ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. కొత్త కాపురం మొదలు పెట్టగానే అమ్మాయి చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.. స్థానికులు కూడా కంట తడి పెడుతున్నారు..
తాజావార్తలు
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!