తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,530 శాంపిల్స్ పరీక్షించగా.. 643 మందికి పాజిటివ్గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. తాజాగా 767 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,012కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాతో 3,778 మంది మృతిచెందారు.. 6,26,505 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.88 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.