Telangana: తెలంగాణలో ‘నోటిఫైడ్ డిసీజ్’గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!
- క్యాన్సర్కు నోటిఫైడ్ హోదా
- ప్రతి కేసు రికార్డ్ తప్పనిసరి
- ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నిబంధన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసేందుకు, ఇకపై ఈ వ్యాధిని ‘నోటిఫైడ్ డిసీజ్’ (Notifiable Disease) గా గుర్తిస్తూ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ జీవో నంబర్ 17ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ఏ మూలన క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్లో నమోదు చేయడం ఇప్పుడు చట్టబద్ధంగా అనివార్యం.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
గతంలో కేవలం నిమ్స్ (NIMS) , మెహదీ నవాజ్ జంగ్ (MNJ) వంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు నిర్వహించబడేవి. దీనివల్ల ప్రైవేట్ రంగంలో చికిత్స పొందుతున్న వేలాది మంది రోగుల వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండేవి కావు. ఫలితంగా వ్యాధి తీవ్రత ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ఏ వయస్సు వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు అనే అంశాలపై ఖచ్చితమైన అంచనా ఉండేది కాదు. ఈ లోటును భర్తీ చేస్తూ, ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, , చివరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ వద్దకు వచ్చే క్యాన్సర్ కేసుల వివరాలను ఒక నెల రోజుల్లోపు ఆరోగ్య శాఖకు నివేదించాల్సి ఉంటుంది.
Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల ఖచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద కేంద్రీకృతం అవుతుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే (MNJ) క్యాన్సర్ ఆసుపత్రి ఈ సమాచార సేకరణకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుంది. సేకరించిన ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో ఎక్కడ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఏ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి , ఎక్కడ పాలియేటివ్ కేర్ సేవలను విస్తరించాలి అనే విషయాలపై శాస్త్రీయమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. రోగుల వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే, ప్రజారోగ్య ప్రయోజనాల కోసం ఈ గణాంకాలను విశ్లేషించి క్యాన్సర్ రహిత తెలంగాణ దిశగా అడుగులు వేయడం ఈ జీవో ప్రధాన ఉద్దేశ్యం.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?