Telangana: తెలంగాణలో ‘నోటిఫైడ్ డిసీజ్’గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!
- క్యాన్సర్కు నోటిఫైడ్ హోదా
- ప్రతి కేసు రికార్డ్ తప్పనిసరి
- ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నిబంధన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసేందుకు, ఇకపై ఈ వ్యాధిని ‘నోటిఫైడ్ డిసీజ్’ (Notifiable Disease) గా గుర్తిస్తూ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ జీవో నంబర్ 17ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ఏ మూలన క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్లో నమోదు చేయడం ఇప్పుడు చట్టబద్ధంగా అనివార్యం.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
గతంలో కేవలం నిమ్స్ (NIMS) , మెహదీ నవాజ్ జంగ్ (MNJ) వంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు నిర్వహించబడేవి. దీనివల్ల ప్రైవేట్ రంగంలో చికిత్స పొందుతున్న వేలాది మంది రోగుల వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండేవి కావు. ఫలితంగా వ్యాధి తీవ్రత ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ఏ వయస్సు వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు అనే అంశాలపై ఖచ్చితమైన అంచనా ఉండేది కాదు. ఈ లోటును భర్తీ చేస్తూ, ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, , చివరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ వద్దకు వచ్చే క్యాన్సర్ కేసుల వివరాలను ఒక నెల రోజుల్లోపు ఆరోగ్య శాఖకు నివేదించాల్సి ఉంటుంది.
Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల ఖచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద కేంద్రీకృతం అవుతుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే (MNJ) క్యాన్సర్ ఆసుపత్రి ఈ సమాచార సేకరణకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుంది. సేకరించిన ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో ఎక్కడ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఏ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి , ఎక్కడ పాలియేటివ్ కేర్ సేవలను విస్తరించాలి అనే విషయాలపై శాస్త్రీయమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. రోగుల వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే, ప్రజారోగ్య ప్రయోజనాల కోసం ఈ గణాంకాలను విశ్లేషించి క్యాన్సర్ రహిత తెలంగాణ దిశగా అడుగులు వేయడం ఈ జీవో ప్రధాన ఉద్దేశ్యం.
తాజావార్తలు
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!