Telangana: తెలంగాణలో ‘నోటిఫైడ్ డిసీజ్’గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!
- క్యాన్సర్కు నోటిఫైడ్ హోదా
- ప్రతి కేసు రికార్డ్ తప్పనిసరి
- ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నిబంధన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసేందుకు, ఇకపై ఈ వ్యాధిని ‘నోటిఫైడ్ డిసీజ్’ (Notifiable Disease) గా గుర్తిస్తూ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ జీవో నంబర్ 17ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ఏ మూలన క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్లో నమోదు చేయడం ఇప్పుడు చట్టబద్ధంగా అనివార్యం.
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
గతంలో కేవలం నిమ్స్ (NIMS) , మెహదీ నవాజ్ జంగ్ (MNJ) వంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు నిర్వహించబడేవి. దీనివల్ల ప్రైవేట్ రంగంలో చికిత్స పొందుతున్న వేలాది మంది రోగుల వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండేవి కావు. ఫలితంగా వ్యాధి తీవ్రత ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ఏ వయస్సు వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు అనే అంశాలపై ఖచ్చితమైన అంచనా ఉండేది కాదు. ఈ లోటును భర్తీ చేస్తూ, ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, , చివరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ వద్దకు వచ్చే క్యాన్సర్ కేసుల వివరాలను ఒక నెల రోజుల్లోపు ఆరోగ్య శాఖకు నివేదించాల్సి ఉంటుంది.
Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల ఖచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద కేంద్రీకృతం అవుతుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే (MNJ) క్యాన్సర్ ఆసుపత్రి ఈ సమాచార సేకరణకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుంది. సేకరించిన ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో ఎక్కడ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఏ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి , ఎక్కడ పాలియేటివ్ కేర్ సేవలను విస్తరించాలి అనే విషయాలపై శాస్త్రీయమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. రోగుల వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే, ప్రజారోగ్య ప్రయోజనాల కోసం ఈ గణాంకాలను విశ్లేషించి క్యాన్సర్ రహిత తెలంగాణ దిశగా అడుగులు వేయడం ఈ జీవో ప్రధాన ఉద్దేశ్యం.
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!