India: ఇరాన్లోని భారతీయులకు హై అలర్ట్.. వెంటనే దేశం విడిచి రావాలని కేంద్రం ఆదేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అక్కడ ఉన్న భారతీయ పౌరులందరూ వెంటనే ఇరాన్ను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు లేదా భారత్కు తిరిగి రావాలని సూచించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రకటనలో ఏం చెప్పిందంటే.. ఇరాన్లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఎవరైనా సరే.. అందుబాటులో ఉన్న విమానాలు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది.
READ ALSO: Quick Sooji Chilla Recipe: కేవలం 10 నిమిషాల్లో టేస్టీ, హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ
Also Read
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
భారీ జనసమూహాలు, నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించింది. అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే ఇబ్బంది కలగకుండా.. పాస్పోర్ట్, వీసా, ఐడి కార్డులను ఎప్పుడూ తమ వద్దే ఉంచుకోవాలని భారతీయులకు తెలిపింది. ఇరాన్లో ఉన్న భారతీయులందరూ తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దీనివల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రభుత్వం నేరుగా వారిని సంప్రదించి సహాయం చేయడానికి వీలవుతుంది.
హెల్ప్లైన్ నంబర్లు ఇవే..
మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇరాన్లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి ఈ నంబర్లు ఉపయోగించాలని సూచించింది.
ఫోన్ నంబర్లు: * +98 9128109115
* +98 9128109109
* +98 9128109102
* +98 9932179359
* ఇమెయిల్: cons.tehran@mea.gov.in
ఇరాన్లో పరిస్థితి వేగంగా మారుతున్నందున, అక్కడ ఉన్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరూ రిస్క్ తీసుకోవద్దని, వీలైనంత త్వరగా స్వదేశానికి చేరుకోవాలని సూచించింది.
READ ALSO: HAL Clarifies: తేజస్ విమానం కూలిపోలేదు.. అసలు నిజం ఇదే: పుకార్లపై హెచ్ఏఎల్ స్పష్టత
తాజావార్తలు
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!