తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తాం. రైతుల పక్షాన పోరాడతాము అని బండి సంజయ్ అన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయి, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోంది. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే తలలు నరుకుతావా. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి అన్నారు. మా పై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. కోడిగుడ్లు, రాళ్లు పడతాయని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు అని తెలిపారు.
ఇక ఖచ్చితంగా వానాకాలం పంట మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదు. ఎనిమిది రాష్ట్రాల్లో లేని సమస్యలు ఇక్కడే ఎందుకు. కొనుగోళ్ల లో అన్నింటీకీ మేమే డబ్బులు ఇస్తున్నాం. 2022 వరకు రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలను నిలబెట్టుకుంటాం. పథకం ప్రకారం రైతులను సతాయించి ఇబ్బందులు పెట్టి కొనుగోలు చేయాలని చూస్తోంది. రుణమాఫీ చేస్తామని చేయలేదు, ఫసల్ భీమా యోజన ఎందుకు అమలు చేయలేదు. కాళ్ళు మొక్కిన కలెక్టర్ ను ఎమ్మెల్సీ చేస్తున్నారు.. ప్రజలు,రైతులకు ఇబ్బందులు పెట్టిన వారికి పదవులా అని అడిగారు. అలాగే బీజేపీ ప్రశ్నించకుంటే ఇప్పటికైనా కొనుగోళ్లు ప్రారంభం కాకపోయేవి. మావి ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసుల బందోబస్తు, వారి సహకారంతో దాడులు చేస్తున్నారు. మాపై దాడికి స్కెచ్ వేసినప్పుడే నిన్నటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అవినీతి చిట్టా తీస్తాం, తప్పకుండా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాము. నిన్న దాడిలో మిర్యాలగూడ ఏబీఎన్ రిపోర్టర్ మనోజ్ కు గాయాలయ్యాయి, దారుణం అని పేర్కొన్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!