బీజేపీ అనూహ్య నిర్ణయం.. అమిత్ షా ను ‘అక్కడికి’ రప్పిస్తున్నారట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 17న.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ విమోచన దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు తమకు మరింత ప్రజాదరణ రావడమే లక్ష్యంగా సూపర్ ప్లాన్ వేశారు. ఏకంగా.. పార్టీ అగ్రనేత అమిత్ షాను రప్పించి.. సభ నిర్వహించి.. పార్టీ ఉద్దేశాలను జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని అమిత్ షా తో.. నిర్మల్ లో భారీ బహిరంగ సభతో నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
గతంలో సున్నితమైన విషయాల్లో తీవ్రమైన ఘర్షణలు జరిగిన భైంసా ప్రాంతం.. నిర్మల్ జిల్లాలోనే ఉంది. అలాంటి ప్రాంతంలో.. అత్యంత సున్నితమైన నియోజకవర్గంలో.. అమిత్ షాను రప్పించి.. సభను నిర్వహించడం అంటే.. అది మామూలుగా చూడాల్సిన విషయం ఏ మాత్రం కాదు. తెలంగాణలో ఇప్పుడు తమకు ఉన్న అనుకూలతలను మరింత బలంగా మార్చుకునేందుకు.. పార్టీ సందేశాన్ని జనంలోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు.. ఇది ఉపయోగపడుతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే.. మరోసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైలాగ్ వార్ కు.. మరో అడుగు ముందుకు పడినట్టుగానే భావించాలి. అంతే కాక.. నిర్మల్ కు అమిత్ షా అంటూ వస్తే.. త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా రాజకీయాన్ని ముందుకు తీసుకుపోవచ్చన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిర్మల్, హుజూరాబాద్ నియోజకవర్గాలపై అమిత్ షా నిర్మల్ పర్యటనతో.. తమదైన ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని వారు కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర నేతల ప్రయత్నాలు ఫలించి.. అమిత్ షా అంటూ రాష్ట్రానికి వస్తే.. పొలిటికల్ ఫైట్ మరో టర్న్ తీసుకోవడం ఖాయమని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
-
America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..