Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ
- బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్
- 50 శాతం పరిమితి ఉల్లంఘనపై కోర్టు విచారణకు సిద్ధం
- హైకోర్టులో కూడా పెండింగ్లో ఉన్న మాధవరెడ్డి పిటిషన్
- ఎన్నికలపై న్యాయస్థానాల తీర్పులకోసం ఉత్కంఠ పెరుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Body Elections : తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతాయని వాదిస్తూ, వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆయన వాదన. ఈ పిటిషన్పై ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
UP Blast: ఉత్తరప్రదేశ్లో భారీ పేలుడు.. తీవ్ర భయాందోళనలు..
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ఇక మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 8న విచారణకు తీసుకోనుంది. ఇప్పటికే హైకోర్టు, “కోర్టులో కేసు ఉన్న సమయంలో ఎన్నికల ప్రక్రియను ఎందుకు ముందుకు తీసుకువెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తూ, ఎన్నికల ప్రకటనపై ప్రశ్నలు లేవనెత్తింది. అసెంబ్లీ తీర్మానం ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల కూడా కోర్టు ఆక్షేపణలు వ్యక్తం చేసింది.
అక్టోబర్ 8న హైకోర్టు విచారణ జరగనున్న సందర్భంలో, మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైలవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేక అడ్డుకట్ట పడుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నట్లు ప్రకటించింది. కానీ 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టు రెండింటిలోనూ ఉండటంతో, ఈ ఎన్నికల భవిష్యత్తు న్యాయస్థానాల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై వచ్చిన ఈ సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఏ దిశగా వెలువడతాయి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Madannapet Case: మాదన్నపేట బాలిక హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు
తాజావార్తలు
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
ట్రెండింగ్
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!