Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ
- బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్
- 50 శాతం పరిమితి ఉల్లంఘనపై కోర్టు విచారణకు సిద్ధం
- హైకోర్టులో కూడా పెండింగ్లో ఉన్న మాధవరెడ్డి పిటిషన్
- ఎన్నికలపై న్యాయస్థానాల తీర్పులకోసం ఉత్కంఠ పెరుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Body Elections : తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతాయని వాదిస్తూ, వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆయన వాదన. ఈ పిటిషన్పై ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
UP Blast: ఉత్తరప్రదేశ్లో భారీ పేలుడు.. తీవ్ర భయాందోళనలు..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ఇక మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 8న విచారణకు తీసుకోనుంది. ఇప్పటికే హైకోర్టు, “కోర్టులో కేసు ఉన్న సమయంలో ఎన్నికల ప్రక్రియను ఎందుకు ముందుకు తీసుకువెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తూ, ఎన్నికల ప్రకటనపై ప్రశ్నలు లేవనెత్తింది. అసెంబ్లీ తీర్మానం ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల కూడా కోర్టు ఆక్షేపణలు వ్యక్తం చేసింది.
అక్టోబర్ 8న హైకోర్టు విచారణ జరగనున్న సందర్భంలో, మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైలవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేక అడ్డుకట్ట పడుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నట్లు ప్రకటించింది. కానీ 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టు రెండింటిలోనూ ఉండటంతో, ఈ ఎన్నికల భవిష్యత్తు న్యాయస్థానాల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై వచ్చిన ఈ సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఏ దిశగా వెలువడతాయి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Madannapet Case: మాదన్నపేట బాలిక హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!