Revanth Reddy: నేడు కేరళకు వెళ్లనున్న తెలంగాణ సీఎం..
- నేడు కేరళకు సీఎం రేవంత్ రెడ్డి..
- రేపు వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ నామినేషన్..
- ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (మంగళవారం) సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు (బుధవారం) కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, వయనాడ్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో ఆమె గెలుపు కోసం హైకమాండ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు రాయ్ బరేలీ స్థానం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచారు. దీంతో రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేసేశారు. ఈ నేపథ్యంలో అక్కడ బై ఎలక్షన్ అనివార్యమైంది.
Read Also: MechanicRocky : మొన్న చూసుకున్న చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను : విశ్వక్ సేన్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ఇక, గాంధీ కుటుంబాన్ని రాయ్ బరేలి, అమేథీ తర్వాత వయనాడ్ నియోజకవర్గం అక్కున చేర్చుకుంది. 2019లో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోవడంతో.. వయనాడ్లో మాత్రం అఖండ విజయాన్ని ఇక్కడి ప్రజలు అందించింది. 2024 లోకసభ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు రాహుల్ గాంధీని మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. దీంతో గాంధీ కుటుంబానికే చెందిన ప్రియాంకను ఇక్కడ ఎన్నికల బరిలోకి దించారు. వయనాడ్లో యూడీఎఫ్ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ ఈ నెల రేపు (అక్టోబర్ 23న) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సోమవారం అధికారికంగా వెల్లించింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని వెల్లడించారు.
Read Also: Drunk and Drive: బెజవాడలో మందుబాబుల హల్చల్
మరోవైపు, గాంధీ కుటుంబాన్ని ఓడించి వయనాడ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బీజేపీ, సంఘ్ శ్రేణులు వయనాడ్లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. స్థానికంగా మంచి పేరున్న విద్యావంతురాలైన నవ్య హరిదాస్ను కమలం పార్టీ ఎన్నికలబరిలోకి దించింది. ప్రియాంక గాంధీ స్థానికేతరురాలు అనే ప్రచారం చేస్తూ.. స్థానిక సెంటిమెంట్ను రగిలించాలని బీజేపీ యత్నిస్తున్నట్టు పలువురు రాజకీయ విమర్శకులు వెల్లడిస్తున్నారు. కాగా, వామపక్ష పార్టీలకు కంచుకోట కేరళ. అక్కడ అధికార పార్టీ కూడా వామపక్షాలదే. అందుకే, ఈ సారి ఎలాగైన వయనాడ్ను సొంతం చేసుకోవాలని ఎల్డీఎఫ్ సైతం పట్టుదలగా ఉంది.
తాజావార్తలు
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..