ఉద్యమాన్ని అణిచివేయడానికే సెలవులు: TPTF
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె. రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలే అయిందన్నారు. 135 పని దినాల్లో అందులో ప్రత్యేక కార్యక్రమాలు, పరీక్షలు పోనూ జరిగిన బోధనా గంటలు మరీ తక్కువ.ఈ పరిస్థితుల్లో సెలవులను కుదించి, విద్యార్థులకు నష్ట నివారణకు చర్యలు చేపట్టకుండా సెలవులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో లోకల్ క్యాడరైజేషన్న గందరగోళంలో 15రోజుల విలువైన బోధన గంటలు వృధా అయ్యాయన్నారు. ఏ సమూహాలకు, సమావేశాలకు లేని ఒమిక్రాన్ భయం, నిబంధనలు విద్యా సంస్థలకే ఎందుకని వారు ప్రశ్నించారు. జీవో 317 పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యమాన్ని నిలువరించేందుకు సెలవుల ప్రకటన చేశారని ఆరోపించారు. సంక్రాంతికి 3 రోజుల సెలవులు చాలన్న అభిప్రాయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అడిగేది పక్కన పెట్టి, అనవసరమైన సెలవుల ప్రకటనలో తొందర ఎందుకని వారు మండిపడ్డారు.
Read Also: తిరుపతిలో టూరిజం ఉద్యోగి దారుణ హత్య
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
పారదర్శకత లేకుండా, స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా హడావిడిగా చేసిన జిల్లాల కేటాయింపు ప్రక్రియను రద్దు చేసి, సరైన మార్గదర్శకాలతో తిరిగి చేపట్టాలని కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారన్నారు. దీనికి తోడు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గొంతు కలుపుతున్నాయి. ఈ ఉద్యమాన్ని నిలువరించేందుకు సంక్రాంతి సెలవులను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్రాంతి ఆంధ్రా పండగ అని, ఇక్కడ పెద్దగా జరుపుకోరని ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటించి అప్పటి వరకు ఉన్న సెలవులు రద్దు చేసిన విషయం మర్చిపోవద్దని సూచించారు. టీచర్లు వ్యతిరేకిస్తున్న జిల్లాల కేటాయింపు, బదిలీలను ఏక పక్షంగా పూర్తి చేయడానికే, ఓమిక్రాన్ పేరుతో సెలవులు పొడిగించారని వారు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సంక్రాంతి సెలవులను 3 రోజులకు పరిమితం చేసి, లోకల్ క్యాడరైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా, స్పష్టమైన మార్గదర్శకాలతో తిరిగి నిర్వహించాలని కె. రమణ, మైస శ్రీనివాసులు కోరారు.
తాజావార్తలు
-
TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!