Tarun Chugh: కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది.. తరుణ్ చుగ్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarun Chugh Demands Sitting Judge Investigation On TSPSC Paper Leak: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ పేపర్ లీకేజ్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని కూడా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పై నుంచి ఆదేశాలు లేనిదే ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ సాధ్యం కాదన్న ఆయన.. ఈ లీక్తో మోసపోయామని భావించిన వందలాది మంది యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడి చేయలేరన్నారు. మహిళలను సైతం విచక్షణారహితంగా కొట్టారన్నారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారన్నారు.
Minister KTR: బండి సంజయ్ ఒక దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని.. కేటీఆర్ ఫైర్
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
సంజయ్ కుమార్ను అరెస్టు చేసో, ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడో.. ఈ స్కామ్ నుంచి బయటపడొచ్చని కేసీఆర్ భావిస్తే.. అది అవివేకమే అవుతుందని తరుణ్ చుగ్ విమర్శించారు. ఈ స్కామ్పై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్తో విచారణ చేయించడానికి కేసీఆర్ ఎందుకు వెనుకాడుతున్నారు? ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు? ఎవరిని రక్షించేందుకు చూస్తున్నారు? ఎందుకు ఈ మొండివైఖరి? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువకుల భవిష్యత్తు ఆగమైందని, వారి ఆవేదన ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని అడిగారు. TSPSC స్కామ్కు పాల్పడిన అసలు దోషులను శిక్షించే వరకు.. ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు తెలంగాణ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్న డిమాండ్ను బీజేపీ తెలంగాణ శాఖ పునరుద్ఘాటిస్తోందని అన్నారు. యువత, TSPSC అభ్యర్థులు అధైర్యపడొద్దని సూచించారు. కెసిఆర్ మోసాన్ని బీజేపీ ప్రజల ముందు నగ్నంగా బయటపెడుతుందని.. అహంకారాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్ కుటుంబం భారీ మూల్యం చెల్లించుకునే రోజు ఎంతో దూరం లేదని చెప్పారు.
Delhi Liquor Case: మనీష్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు..
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!