Cpm Jana Chaitanya Yatra: నేటి నుంచి సీపీఎం జనచైతన్య యాత్ర.. ప్రారంభించనున్నసీతారాం ఏచూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cpm Jana Chaitanya Yatra: బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం అంటూ సీపీఎం అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణలో నేటి నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. బహిరంగ సభకు వరంగల్ లోని ఆజంజాహిమిల్లు గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ఆజంజాహి మిల్లు గ్రౌండ్ లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే సభలో ప్రసంగించనున్నారు. యాత్రకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ నాయకత్వం వహిస్తారు. యాత్ర హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రయాణించి 29న హైదరాబాద్ ముగింపు సభతో ముగుస్తుంది.
Read also: Tsrtc Special buses: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 50 మంది విద్యార్థినులకో బస్
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
కాగా.. రాజ్యాంగ హక్కు ల పరిరక్షణకు సీపీఎం కేంద్ర కమిటీ చేపట్టే ప్రచార కార్యక్రమం రాష్ట్రంలోని మూడుచోట్ల ప్రారంభించనున్నట్టు తెలిపారు. నేడు వరంగల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఈనెల 23న ఆదిలాబాద్లో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. 24న నిజామాబాద్లో మాజీ ఎంపీ విజయరాఘవన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక.. 29న హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జనచైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని చెప్పారు. అయితే.. ఈ కార్యక్రమానికి తమ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తమ్మినేని వీరభద్రం వివరించారు. కాగా.. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
Maharashtra: మహారాష్ట్రలో 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు కూడా లీక్
తాజావార్తలు
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!