Tammareddy Bharadhwaj : తెలంగాణలో లొకేషన్ ఛార్జీలు తీసేయాలి : తమ్మారెడ్డి భరద్వాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి తలసానికి వినతిపత్రం సమర్పించామని సినీ నిర్మాత తమ్మారెడ్డ భరద్వాజ అన్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి సమస్యల గురించి చర్చించారని ఆయన అన్నారు. ఆన్లైన్ బుకింగ్ తెస్తామని రెండు ప్రభుత్వాలు చెప్పాయని, బుక్ మై షో వాళ్ళు టికెట్పై 15 నుంచి 25 రూపాయల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు. ఆన్లైన్ వస్తే దోపిడీ పోతుంది. ప్రొడ్యూసర్ కు డబ్బులు కూడా వస్తాయని, ఆన్లైన్ బుకింగ్ ఛాంబర్ తో కలిసి ఉండాలి. ప్రభుత్వం తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కుదరదని ఆయన అన్నారు.
ఇంగ్లీషు, హిందీ సినిమాలకు క్యూబ్ వంటి సంస్థలు ఛార్జ్ చేయరు. తెలుగు, చిన్న సినిమాల వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు. దాంతో నష్టం వస్తుందని ఆయన వెల్లడించారు. ట్రాన్స్ ఫర్ ఛార్జీ కూడా తీసుకుంటున్నారని, టిక్కెట్ రేట్లు అనేది చాలా చిన్న ఇష్యూ అని ఆయన అన్నారు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచారు. కానీ తగ్గించక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రేట్లు పెంచితే డబ్బులు వస్తాయనేది భ్రమ అని ఆయన తెలిపారు. ఆంధ్రలో పుష్పా సినిమా ఎక్కువ డబ్బులు రాబట్టిందని, అఖండా కంటే పుష్పా ఎక్కువ పోయిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ స్క్రీన్ లలో సినిమా వేస్తే డబ్బులు వస్తాయని, 200 కోట్లు సినిమా ఉంటే 80 కోట్లు ట్యాక్స్ కట్టాలని, వెయ్యి కోట్లకు 20 కోట్లు ట్యాక్స్ కట్టాలని ఆయన అన్నారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ప్రభుత్వంతో అన్ని సరి చేసుకోవాలి. ఐదు షోలు కొన్నింటికి పెట్టుకోవాలని, 2013 నుంచి అవార్డులు ఇవ్వడం లేదన్నారు. చిన్న సినిమాలకు ఏపీలో సబ్సిడీలు ఇవ్వాలని, తెలంగాణలో సింహా అవార్డులు ఇస్తామన్నారు. ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. తెలంగాణలో లొకేషన్ ఛార్జీలు తీసేయాలని, మినీ థియేటర్లు ఎక్కువగా రావాల్సి ఉంది. వాటి వల్ల రెవెన్యూ బాగా వస్తుంది. థియేటర్లకు ఇండస్ట్రీయల్ పవర్ టారిఫ్ తీసుకోవాలని, కరోనా సమయంలో థియేటర్లకు కరెంటు బిల్లు రెండు రాష్ట్రాలు మినహాయింపు ఇవ్వలేదని, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సినీ పరిశ్రమ కూడా తప్పులు చేసిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!