Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పాతనగరంలో మెట్రో రైల్ విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా దారుల్ షిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ మార్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మెట్రో రైల్ చీఫ్ ఇంజినీర్ ఎస్. భాస్కర్ రెడ్డితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్రభావితమవుతున్న మొత్తం 888 ఆస్తులలో ఇప్పటికే 833 ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన 55 ఆస్తులలో ఉన్న పురాతన భవనాలు, వారసత్వ కట్టడాలకు ఎలాంటి హాని కలగకుండా మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. అనేక ప్రతిబంధకాల మధ్య భూసేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన రెవెన్యూ అధికారుల కృషిని అజిత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలు, వాటర్ వర్క్స్ పైపులు తదితర యుటిలిటీలను సురక్షితంగా, వేగంగా వేరే ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. అలాగే భూసేకరణ పూర్తయిన ఆస్తులను త్వరితగతిన తొలగించి, పనులు చేపట్టడానికి అనువుగా రైట్ ఆఫ్ వే (ROW) సాధించేలా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రాక పట్ల స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పనుల పురోగతికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి మెట్రో ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!