Support Moranchapalli: దయనీయ స్థితిలో మోరంచపల్లి వాసులు.. ఆపన్న హస్తం కోసం ఎదరుచూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Support Moranchapalli: మోరంచ వాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. గురువారం తెల్లవారుజామున వాగు నీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని చెట్టుకొకరు.. పుట్టకొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ వట్టిపోయాయి. ఊరిని ముంచిన వాగు శాంతించి వెనక్కి తగ్గినా.. వరద ఉధృతికి సరుకులన్నీ ఏటో కొట్టుకుపోయి ఇళ్లన్నీ నీళ్లు, బురదతో నిండి దయనీయ స్థితిలో ఉన్నారు. వరుద ఉధృతికి కొట్టుకొనిపోయిన తీరుతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం ఏవీ లేవిప్పుడు. వరద నీటికి ఇళ్లన్నీ బురదమయం అయ్యాయి.. నిత్యావసరాలు. వాగులో కొట్టుకుపోనయి ఇంట్లో ఉన్న వస్తువులన్ని పాడైనయి వరద ఉధృతికి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన మోరాంచపల్లి వాసులకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందలేదు. స్వచ్ఛంద సంస్థలే వారికి అండగా నిలుస్తున్నాయి.
Read also: Facebook Post: సిల్లీ పోస్ట్ పెట్టాడు.. పోలీసులు అతని సరదా తీర్చారు
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
మోరాంచపల్లి గ్రామంలో 283 ఇళ్లు ఉండగా, సుమారు 985 మంది ప్రజలు నివసిస్తున్న జనాభా ఉంది. ఈ గ్రామం గురువారం తెల్లవారుజామున నీట మునగ్గా.. శుక్ర, శనివారాల్లో ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆదివారం కూడా గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి తమకు పైసా సాయం అందలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ములుగు జిల్లా కొండాయిలో వరదలకు నిరాశ్రయులైన వారికి 25కిలోల బియ్యంతోపాటు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు తక్షణ సాయం కింద మంత్రి సత్యవతి రాథోడ్ అందించారు. కానీ.. మోరంచపల్లివాసులకు మాత్రం ఇప్పటి వరకూ తక్షణ సాయం కింద ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటంపై వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిపోతున్నారే గానీ, ప్రభుత్వం నుంచి సాయం మాత్రం అందలేదని స్థానికులు వాపోతున్నారు.తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మోరాంచ పల్లి వాసుల దుస్థిని చూసిన సచ్చంద సంస్థలు వారికి నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, దుప్పట్లు, చాపలు, దిండ్లు తదితర సామగ్రిని అందిస్తూ భరోసా ఇస్తున్నాయి. 5 వేల నుంచి 10 వేల రూపాయల విలువ చేసే సామగ్రిని బాధితులకు అందిస్తున్నాయి. అలాగే జీఎంఆర్ ట్రస్టు.. గ్రామంలోని ఒక్కొక్క కుటుంబానికీ రూ.4వేల చొప్పున నగదును అందించింది. మాజీ సైనికులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆదుకోకున్నా.. ఇలా స్వచ్ఛంద సంస్థల నుంచి అందుతున్న సాయంతో బాధితులకు కొంత ఊరట కలుగుతోంది. వరద ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకున్న మోరంచపల్లిలో ప్రజలు పుట్టెడు శోకంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
Telangana Rains: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
తాజావార్తలు
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!