IIT Student: ప్లీజ్ నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి.. ఐఐటీ విద్యార్థిని సూసైడ్ నోట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Student: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ అనే విద్యార్థి.. వైజాగ్లో మృతదేహం లభ్యమైన ఘటనను మరిచిపోకముందే.. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఐఐటీ హైదరాబాద్లో పీజీ ఫస్టియర్ (ఎంటెక్) చదువుతున్న ఒడిశాకు చెందిన మమైతా నాయక్ ఆగస్టు 7వ తేదీ రాత్రి క్యాంపస్లోని హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మమైత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మమైత గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
Read also: మెడ మీద నలుపు ఎంతకీ పోవట్లేదా? ఇలా చేయండి
Also Read
మమైతా నాయక్ సూసైడ్ నోట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. డిప్రెషన్తో చనిపోతున్నారని సూసైడ్ నోట్లో రాసింది. “ప్లీజ్… నా డెడ్ బాడీని ఎవ్వరికీ చూపించొద్దు.. నా డెడ్ బాడీని కనీసం మా పేరెంట్స్ కి మీడియాకు చూపించొద్దు.. ప్లీజ్ ఇది నా విన్నపం.. నా చావుకి గల కారణాలను విచారించాల్సిన అవసరం లేదు. నా చావుకి కారణం… నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి.” అని మమైత తన సూసైడ్ నోట్లో రాసింది. అయితే.. ఒడిశాకు చెందిన మమైతా నాయక్ అనే బాలిక ఎంటెక్ చదివేందుకు జూలై 26న హైదరాబాద్ ఐఐటీలో చేరింది. అయితే.. కాలేజీలో చేరిన 12 రోజులకే ఆత్మహత్యకు పాల్పడి.. డిప్రెషన్ తో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోవడం అందరినీ కలిచివేసింది. మరోవైపు.. సూసైడ్ నోట్లో మమైత చేతిరాత ముత్యాల్లా అందంగా ఉందని.. ఇంత మంచి రాత రాసే అమ్మాయికి ఏం ఇబ్బంది అని అందరూ వాపోతున్నారు.
Read also: The Soul Of Satya: కలర్స్ స్వాతితో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..
కాగా, ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022-23 సంవత్సరంలోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరం. చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు సూసైడ్ నోట్లు రాయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఆగస్టు 31న ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన రాహుల్ అనే విద్యార్థి క్యాంపస్లోని మంచానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మెగ్ కపూర్ సంగారెడ్డిలోని లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!