IIT Student: ప్లీజ్ నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి.. ఐఐటీ విద్యార్థిని సూసైడ్ నోట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Student: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ అనే విద్యార్థి.. వైజాగ్లో మృతదేహం లభ్యమైన ఘటనను మరిచిపోకముందే.. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఐఐటీ హైదరాబాద్లో పీజీ ఫస్టియర్ (ఎంటెక్) చదువుతున్న ఒడిశాకు చెందిన మమైతా నాయక్ ఆగస్టు 7వ తేదీ రాత్రి క్యాంపస్లోని హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మమైత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మమైత గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
Read also: మెడ మీద నలుపు ఎంతకీ పోవట్లేదా? ఇలా చేయండి
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
మమైతా నాయక్ సూసైడ్ నోట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. డిప్రెషన్తో చనిపోతున్నారని సూసైడ్ నోట్లో రాసింది. “ప్లీజ్… నా డెడ్ బాడీని ఎవ్వరికీ చూపించొద్దు.. నా డెడ్ బాడీని కనీసం మా పేరెంట్స్ కి మీడియాకు చూపించొద్దు.. ప్లీజ్ ఇది నా విన్నపం.. నా చావుకి గల కారణాలను విచారించాల్సిన అవసరం లేదు. నా చావుకి కారణం… నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి.” అని మమైత తన సూసైడ్ నోట్లో రాసింది. అయితే.. ఒడిశాకు చెందిన మమైతా నాయక్ అనే బాలిక ఎంటెక్ చదివేందుకు జూలై 26న హైదరాబాద్ ఐఐటీలో చేరింది. అయితే.. కాలేజీలో చేరిన 12 రోజులకే ఆత్మహత్యకు పాల్పడి.. డిప్రెషన్ తో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోవడం అందరినీ కలిచివేసింది. మరోవైపు.. సూసైడ్ నోట్లో మమైత చేతిరాత ముత్యాల్లా అందంగా ఉందని.. ఇంత మంచి రాత రాసే అమ్మాయికి ఏం ఇబ్బంది అని అందరూ వాపోతున్నారు.
Read also: The Soul Of Satya: కలర్స్ స్వాతితో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..
కాగా, ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022-23 సంవత్సరంలోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరం. చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు సూసైడ్ నోట్లు రాయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఆగస్టు 31న ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన రాహుల్ అనే విద్యార్థి క్యాంపస్లోని మంచానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మెగ్ కపూర్ సంగారెడ్డిలోని లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..