Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?
Korutla councillor husband attack with knives: జగిత్యాల జిల్లా కోర్టుల్లో దారుణం చోటుచేసుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన బీఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం(48)పై అందరూ చూస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీరాజం ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. తీవ్ర గాయం కావడంతో.. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. అయితే.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తాలో ఉదయం.. ఓ హోటల్లో లక్ష్మీరాజం తన సహచరులతో కలిసి టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చారు. కత్తులతో మెడపై నరికేశారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అదే బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో కిందపడిన లక్ష్మీరాజంను స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Read also: KCR Govt: ఇమామ్లు, మౌజంలకు గుడ్న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
అయితే.. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. దీంతో లక్ష్మీరాజం ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ కూడా పరిశీలించారు. దాడి చేసింది ఎవరు, కారణాలేంటి? ఈ ఘటనతో కోరుట్లలో భయానక వాతావరణం నెలకొంది. అయితే.. లక్ష్మీరాజం మామిడి తోటల కాంట్రాక్టర్. ఈ క్రమంలో పలు భూములకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయి. అయితే.. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులోనూ.. లక్ష్మీరాజం చనిపోయే ముందు నాగరాజు అనే పేరును ఉచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ నాగరాజు ఎవరు? అతను ఆ పేరును ఎంత పలికాడు? వచ్చిన వారిలో నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడా? ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది.
Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!