Korutla councillor husband attack with knives: జగిత్యాల జిల్లా కోర్టుల్లో దారుణం చోటుచేసుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన బీఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం(48)పై అందరూ చూస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీరాజం ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. తీవ్ర గాయం కావడంతో.. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. అయితే.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తాలో ఉదయం.. ఓ హోటల్లో లక్ష్మీరాజం తన సహచరులతో కలిసి టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చారు. కత్తులతో మెడపై నరికేశారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అదే బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో కిందపడిన లక్ష్మీరాజంను స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Read also: KCR Govt: ఇమామ్లు, మౌజంలకు గుడ్న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
అయితే.. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. దీంతో లక్ష్మీరాజం ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ కూడా పరిశీలించారు. దాడి చేసింది ఎవరు, కారణాలేంటి? ఈ ఘటనతో కోరుట్లలో భయానక వాతావరణం నెలకొంది. అయితే.. లక్ష్మీరాజం మామిడి తోటల కాంట్రాక్టర్. ఈ క్రమంలో పలు భూములకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయి. అయితే.. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులోనూ.. లక్ష్మీరాజం చనిపోయే ముందు నాగరాజు అనే పేరును ఉచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ నాగరాజు ఎవరు? అతను ఆ పేరును ఎంత పలికాడు? వచ్చిన వారిలో నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడా? ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది.
Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?