Students Struggle For Bus: బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు.. ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Struggle For Bus: బస్సుల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. సమయానికి బస్సులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజీలకు వెల్లేందుకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుందని వాపోతున్నారు. ఇలా రోజు జరిగితే ఎలా? అంటూ ప్రశ్నింస్తున్నారు. పాసులు వున్నా ఫలితం లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులు ఒకటి రెండు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతోనే బస్సుకోసం రోడ్డెక్కాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి లో చోటుచేసుకుంది.
Read also: Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి
Also Read
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి లోని కళాశాలలకు వచ్చే ఎన్.ఎస్.యు.ఐ.విద్యార్థులకు ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ అనిల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ మెహిదీపట్నం నుంచి శంకర్ పల్లి రూట్ లో హైదరాబాద్ టు డిపో అధికారులు మెదీపట్నం డిపో అధికారులు బస్సులు నడిపిస్తుంటారు. విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు ఇచ్చే బస్వాసులు పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. పల్లె వెలుగు బస్సులు రెండు మూడు మినహా ఎక్కువ బస్సులు లేవు దీంతో కళాశాలలకు రావాలంటే సమయానికి రాలేకపోతున్నారని అన్నారు. మెట్రో బస్సులు ఉన్నప్పటికీ పాసులు అనుమతించకపోవడంతో సమయానికి పల్లె వెలుగు బస్సులు లేకపోవడం కళాశాలకు ఆలస్యంగా రావడంతో నిత్యం నరకం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. దీంతో శంకర్పల్లి బస్టాండ్ లో కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లె వెలుగు బస్సులు పెంచాలని కోరుతున్నారు. లేకుంటే మెట్రో బస్సుల్లో పల్లె వెలుగు పాసులు అనుమతించాలని కోరుతున్నారు.
Russia-Ukraine War: మరోసారి బయటపడ్డ రష్యా అరాచరకాలు.. ఖేర్సన్లోనూ రిపీట్
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!