Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పులులు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరించడం కలకలం రేపుతోంది..మొన్నామద్య రోడ్డుపై నాలుగు పులులు కనిపించగా తాజాగా మరో సారి పత్తి చేనులో రైతుకు పులులు కనిపించడంతో రైతులు భయకంపితులు అవుతున్నారు. మరో వైపు పులుల పాదముద్రలు ట్రాకింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. .టైగర్ ఫియర్ ట్రాకింగ్ కొలిక్కి వస్తే ఎన్ని పులులు వున్నాయనేది అంచనాకు రావచ్చంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారులో కనిపించిననాలుగు పులులు,కొద్ది రోజుల వ్యవధిలో రెండో సారి కనిపించాయి నాలుగు పులులు. బెజ్సూర్ మండలం, మర్తడి,కుంటలు ,కుకుడ శివారు ప్రాంతాల్లో సంచరిస్తుంది పులి.
కొమురం భీం జిల్లాలో రాత్రిళ్ళు కనిపిస్తున్న పులులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఈ కొత్త పులి రాష్ట్ర సరిహద్దులు దాటిందని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీ నుంచి జిల్లాలో హల్చల్ చేసింది ఈపులి. పంట పాలాలు, గ్రామాల్లో సంచరించిన పులి ఎద్దులు, బర్రెలు, మేకలు, ఆవులపై దాడి చేసింది. ఎట్టకేలకు ప్రాణహిత దాటి పొరుగు రాష్ట్రం లోకి వెళ్లింది పులి. పాద ముద్రలను బట్టిఈ మేరకు నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు. దాదాపు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిందీ కొత్త పులి. బెజ్జూర్ మండలం ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్ళినట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు.
Also Read
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
Read Also: Russia-Ukraine War: మరోసారి బయటపడ్డ రష్యా అరాచరకాలు.. ఖేర్సన్లోనూ రిపీట్
కొమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలం నాగేపల్లి, కోయపల్లి శివారులో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచించారు. తమ ప్రాంతంలో పులి తిరుగుతోందని భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బెజ్జూర్ మండలంలో రెండురోజుల క్రితం పులి సంచారం కలకలం రేపింది. కుకుడా గ్రామంలో కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో ఎద్దుకు గాయాలు కాగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు. అనంతరం బాబా సాగర్ కుంట వద్ద కనిపించిన పులి తాజాగా ఆత్రం శ్యాం రావ్ అనే రైతుకు చెందిన ఎద్దుపై దాడి చేయగా పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అడవిలో ఉండాల్సిన పులి గ్రామాల్లోకి రావడంతో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎక్కడ మీద పడుతుందోనని టెన్షన్ పడుతున్నారు జనం.
Read Also: 41st Convocation Of SSSIHL Live: సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం లైవ్
తాజావార్తలు
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!