Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పులులు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరించడం కలకలం రేపుతోంది..మొన్నామద్య రోడ్డుపై నాలుగు పులులు కనిపించగా తాజాగా మరో సారి పత్తి చేనులో రైతుకు పులులు కనిపించడంతో రైతులు భయకంపితులు అవుతున్నారు. మరో వైపు పులుల పాదముద్రలు ట్రాకింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. .టైగర్ ఫియర్ ట్రాకింగ్ కొలిక్కి వస్తే ఎన్ని పులులు వున్నాయనేది అంచనాకు రావచ్చంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారులో కనిపించిననాలుగు పులులు,కొద్ది రోజుల వ్యవధిలో రెండో సారి కనిపించాయి నాలుగు పులులు. బెజ్సూర్ మండలం, మర్తడి,కుంటలు ,కుకుడ శివారు ప్రాంతాల్లో సంచరిస్తుంది పులి.
కొమురం భీం జిల్లాలో రాత్రిళ్ళు కనిపిస్తున్న పులులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఈ కొత్త పులి రాష్ట్ర సరిహద్దులు దాటిందని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీ నుంచి జిల్లాలో హల్చల్ చేసింది ఈపులి. పంట పాలాలు, గ్రామాల్లో సంచరించిన పులి ఎద్దులు, బర్రెలు, మేకలు, ఆవులపై దాడి చేసింది. ఎట్టకేలకు ప్రాణహిత దాటి పొరుగు రాష్ట్రం లోకి వెళ్లింది పులి. పాద ముద్రలను బట్టిఈ మేరకు నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు. దాదాపు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిందీ కొత్త పులి. బెజ్జూర్ మండలం ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్ళినట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు.
Also Read
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
Read Also: Russia-Ukraine War: మరోసారి బయటపడ్డ రష్యా అరాచరకాలు.. ఖేర్సన్లోనూ రిపీట్
కొమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలం నాగేపల్లి, కోయపల్లి శివారులో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచించారు. తమ ప్రాంతంలో పులి తిరుగుతోందని భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బెజ్జూర్ మండలంలో రెండురోజుల క్రితం పులి సంచారం కలకలం రేపింది. కుకుడా గ్రామంలో కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో ఎద్దుకు గాయాలు కాగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు. అనంతరం బాబా సాగర్ కుంట వద్ద కనిపించిన పులి తాజాగా ఆత్రం శ్యాం రావ్ అనే రైతుకు చెందిన ఎద్దుపై దాడి చేయగా పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అడవిలో ఉండాల్సిన పులి గ్రామాల్లోకి రావడంతో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎక్కడ మీద పడుతుందోనని టెన్షన్ పడుతున్నారు జనం.
Read Also: 41st Convocation Of SSSIHL Live: సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం లైవ్
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?