Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పులులు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరించడం కలకలం రేపుతోంది..మొన్నామద్య రోడ్డుపై నాలుగు పులులు కనిపించగా తాజాగా మరో సారి పత్తి చేనులో రైతుకు పులులు కనిపించడంతో రైతులు భయకంపితులు అవుతున్నారు. మరో వైపు పులుల పాదముద్రలు ట్రాకింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. .టైగర్ ఫియర్ ట్రాకింగ్ కొలిక్కి వస్తే ఎన్ని పులులు వున్నాయనేది అంచనాకు రావచ్చంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారులో కనిపించిననాలుగు పులులు,కొద్ది రోజుల వ్యవధిలో రెండో సారి కనిపించాయి నాలుగు పులులు. బెజ్సూర్ మండలం, మర్తడి,కుంటలు ,కుకుడ శివారు ప్రాంతాల్లో సంచరిస్తుంది పులి.
కొమురం భీం జిల్లాలో రాత్రిళ్ళు కనిపిస్తున్న పులులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఈ కొత్త పులి రాష్ట్ర సరిహద్దులు దాటిందని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీ నుంచి జిల్లాలో హల్చల్ చేసింది ఈపులి. పంట పాలాలు, గ్రామాల్లో సంచరించిన పులి ఎద్దులు, బర్రెలు, మేకలు, ఆవులపై దాడి చేసింది. ఎట్టకేలకు ప్రాణహిత దాటి పొరుగు రాష్ట్రం లోకి వెళ్లింది పులి. పాద ముద్రలను బట్టిఈ మేరకు నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు. దాదాపు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిందీ కొత్త పులి. బెజ్జూర్ మండలం ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్ళినట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు.
Also Read
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
Read Also: Russia-Ukraine War: మరోసారి బయటపడ్డ రష్యా అరాచరకాలు.. ఖేర్సన్లోనూ రిపీట్
కొమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలం నాగేపల్లి, కోయపల్లి శివారులో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచించారు. తమ ప్రాంతంలో పులి తిరుగుతోందని భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బెజ్జూర్ మండలంలో రెండురోజుల క్రితం పులి సంచారం కలకలం రేపింది. కుకుడా గ్రామంలో కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో ఎద్దుకు గాయాలు కాగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు. అనంతరం బాబా సాగర్ కుంట వద్ద కనిపించిన పులి తాజాగా ఆత్రం శ్యాం రావ్ అనే రైతుకు చెందిన ఎద్దుపై దాడి చేయగా పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అడవిలో ఉండాల్సిన పులి గ్రామాల్లోకి రావడంతో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎక్కడ మీద పడుతుందోనని టెన్షన్ పడుతున్నారు జనం.
Read Also: 41st Convocation Of SSSIHL Live: సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం లైవ్
తాజావార్తలు
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!