Stephen Raveendra: గత ఏడాది తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Raveendra: గత ఏడాది తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయని సైబరాబాద్ సీ.పీ.స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అయితే.. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 12శాతం నేరాలు తగ్గాయని తెలిపారు. ఇది కానిస్టేబుల్ నుండి సీపీ వరకు అందరూ చేసిన కృషి వల్లే సాధ్యం అయిందన్నారు. ఈ ఏడాది ముఖ్యమైన ఈవెంట్స్ కూడా సైబరాబాద్ పోలీస్ సమర్థంగా నిర్వహించామని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలతో పాటు…మూడు సార్లు ప్రధాని పర్యటన జరిపారు, సైబరాబాద్ పోలీస్ లు సమర్థంగా పని చేసి.. ఎక్కడా సమస్యలు రానివ్వలేదని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో లో అన్ని పండుగలు ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరిగాయని గుర్తుచేశారు.
Read also: Dhamaka Movie Review: ధమాకా రివ్యూ
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
2010 నుండి పెండింగ్ లో వున్న 80శాతం కేసులు దర్యాప్తు పూర్తి చేసామని తెలిపారు సీ పీ స్టీఫెన్ రవీంద్ర. ఈ ఏడాది 27322 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయ్యాయని అన్నారు. 79 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసామన్నారు. 57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 13 మంది పై రౌడీషీట్ లు తెరవడం తో పాటు, 849 మంది పై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామన్నారు స్టీఫెన్ రవీంద్ర. గత ఏడాది తో పోలిస్తే… రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయని, ఈ ఏడాది నాలుగు మాత్రమే నిజమైన అత్యాచారాలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. మిగిలిన 316 అత్యాచారం కేసులలో అన్నీ పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం లాంటివి జరగాయన్నారు.
Read also: Digvijay Singh: చేతులు జోడించి విజ్ఞప్తి.. కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయండి
గత ఏడాది తో పోలిస్తే..సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయని అన్నారు. గత ఏడాది కన్నా..996 కేసులు అదనంగా నమోదు అయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆన్లైన్ లో 20 లక్షల 96 వేల 961 చలాన్స్ వేశారని, దీని విలువ 96 కోట్ల 64 లక్షలు ఉందని, స్పాట్ లో 6 లక్షల 8 వేల చలాన్స్ వేశాం.. దీని విలువ 24 కోట్ల 91 లక్షలు అని వెల్లడించారు. 3228 యాక్సిడెంట్ కేసుల్లో 749 మంది చనిపోయారని, 55,175 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 979 మందిని జైల్ కి పంపామమన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల ద్వారా 15 కోట్ల 76 లక్షల ఫైన్స్ వేశామని, 32,238 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశామని సీ.పీ.స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
18 Pages MovieReview: 18 పేజీస్ రివ్యూ
తాజావార్తలు
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!