Stephen Raveendra: గత ఏడాది తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Raveendra: గత ఏడాది తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయని సైబరాబాద్ సీ.పీ.స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అయితే.. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 12శాతం నేరాలు తగ్గాయని తెలిపారు. ఇది కానిస్టేబుల్ నుండి సీపీ వరకు అందరూ చేసిన కృషి వల్లే సాధ్యం అయిందన్నారు. ఈ ఏడాది ముఖ్యమైన ఈవెంట్స్ కూడా సైబరాబాద్ పోలీస్ సమర్థంగా నిర్వహించామని తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలతో పాటు…మూడు సార్లు ప్రధాని పర్యటన జరిపారు, సైబరాబాద్ పోలీస్ లు సమర్థంగా పని చేసి.. ఎక్కడా సమస్యలు రానివ్వలేదని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో లో అన్ని పండుగలు ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరిగాయని గుర్తుచేశారు.
Read also: Dhamaka Movie Review: ధమాకా రివ్యూ
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
2010 నుండి పెండింగ్ లో వున్న 80శాతం కేసులు దర్యాప్తు పూర్తి చేసామని తెలిపారు సీ పీ స్టీఫెన్ రవీంద్ర. ఈ ఏడాది 27322 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయ్యాయని అన్నారు. 79 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసామన్నారు. 57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 13 మంది పై రౌడీషీట్ లు తెరవడం తో పాటు, 849 మంది పై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామన్నారు స్టీఫెన్ రవీంద్ర. గత ఏడాది తో పోలిస్తే… రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయని, ఈ ఏడాది నాలుగు మాత్రమే నిజమైన అత్యాచారాలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. మిగిలిన 316 అత్యాచారం కేసులలో అన్నీ పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం లాంటివి జరగాయన్నారు.
Read also: Digvijay Singh: చేతులు జోడించి విజ్ఞప్తి.. కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయండి
గత ఏడాది తో పోలిస్తే..సైబర్ క్రైమ్ నేరాలు 25.84 శాతం పెరిగాయని అన్నారు. గత ఏడాది కన్నా..996 కేసులు అదనంగా నమోదు అయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆన్లైన్ లో 20 లక్షల 96 వేల 961 చలాన్స్ వేశారని, దీని విలువ 96 కోట్ల 64 లక్షలు ఉందని, స్పాట్ లో 6 లక్షల 8 వేల చలాన్స్ వేశాం.. దీని విలువ 24 కోట్ల 91 లక్షలు అని వెల్లడించారు. 3228 యాక్సిడెంట్ కేసుల్లో 749 మంది చనిపోయారని, 55,175 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 979 మందిని జైల్ కి పంపామమన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల ద్వారా 15 కోట్ల 76 లక్షల ఫైన్స్ వేశామని, 32,238 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశామని సీ.పీ.స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
18 Pages MovieReview: 18 పేజీస్ రివ్యూ
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!