Srushti Testtube Baby Centre: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో తెరపైకి సంచలన విషయాలు..
- సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో తెరపైకి సంచలన విషయాలు
- చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో పోలీసుల విచారణ
- సరోగసి కోసం డా.నమ్రతను ఆశ్రయించిన దంపతులకు వేరే బిడ్డను ఇచ్చేందుకు ప్రయత్నం
- నమ్రత జాబితాలో చాలా మంది సరోగసి కోసం వచ్చిన దంపతుల డేటా
- నమ్రతను విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్న పోలీసులు
- రిమాండ్ తరువాత కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srushti Testtube Baby Centre: సికింద్రబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. చట్టవ్యతిరేక సరోగసి విధానాలు, పిల్లల అక్రమ విక్రయం వంటి అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన పాత్రధారిగా మారగా, ఆమె ఆధ్వర్యంలో సరోగసి కోసం వచ్చిన దంపతులకు వేరే పిల్లలను ఇవ్వడానికి ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత గోపాలపురంలోని ఓ జంట చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సృష్టి సెంటర్పై దాడులు చేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ, “సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై మేము ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించాం. చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో ఈ కేసును పరిశీలిస్తున్నాం” అని తెలిపారు. నమ్రత వద్ద సరోగసి కోసం వచ్చిన అనేక దంపతుల డేటా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
గోపాలపురానికి చెందిన ఒక జంట ఆన్లైన్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి తెలుసుకుని, సరోగసి కోసం డాక్టర్ నమ్రతను సంప్రదించింది. ఆమె సరోగసి ద్వారా పిల్లవాడిని పొందడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పిందట. జంట సూచించిన ప్రకారం నమ్రత ఇచ్చిన దిశానిర్దేశాలతో వారు విజయవాడకు వెళ్లి శ్యాంపిల్స్ అందజేశారు. ఆ తర్వాత ఒక అద్దె గర్భిణి (సరోగేట్ మదర్) లభించిందని నమ్రత వారికి చెప్పింది.
కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడని నమ్రత జంటకు తెలియజేసింది. సిజేరియన్ ద్వారా డెలివరీ అయ్యిందని చెప్పి, అదనంగా మరో రూ.10 లక్షలు కూడా తీసుకుంది. డబ్బులు చెల్లించిన తర్వాత కొంతకాలం బిడ్డను చూసుకుంటున్న జంటకు, బాబు పోలికలు తమతో సరిపోకపోవడంతో అనుమానం వచ్చింది. DNA టెస్టు చేయాలని వారు కోరినప్పటికీ, నమ్రత నిరాకరించింది. చివరికి జంట ఢిల్లీలో స్వయంగా DNA పరీక్ష చేయించగా, బాబు మరొకరి సంతానంగా తేలింది.
ఈ ఘటన బయటపడిన తర్వాత పోలీసులు డాక్టర్ నమ్రతపై దర్యాప్తును మరింత కఠినతరం చేశారు. ఆమెను రిమాండ్ అనంతరం కస్టడీలోకి తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నమ్రత విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
“ఈ కేసులో పిల్లల అక్రమ విక్రయం జరుగుతోందా అనే అంశంపై స్పష్టత తీసుకువచ్చేలా అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పటికే DNA టెస్టులు మరియు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తున్నాం,” అని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!