Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో…
Srushti Case: హైదరాబాద్లో సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రతపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఇప్పుడు ఆమెను కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 86 మంది సరోగసీ దంపతుల వివరాలను సేకరించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.…
సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు.
Srushti Case : సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో గోపాలపురం పోలీసులు బుధవారం ఆమెను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ ముమ్మరంగా సాగింది. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ పేరుతో పిల్లల విక్రయాలు అనే తీవ్ర ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు డాక్టర్ నమ్రత తగిన సమాధానాలు ఇవ్వలేదు. చాలాసార్లు ఆమె నోరుమెదపక…
Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు.
Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది.…
DCP Rashmi Perumal : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ క్లినిక్పై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసులు స్పష్టంచేశారు. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. సృష్టి క్లినిక్లో సరోగసి పద్ధతిలో బిడ్డను కల్పిస్తామని చెబుతూ, వాస్తవానికి వేరే మహిళకు పుట్టిన బిడ్డను ఇవ్వడం ద్వారా దంపతులను మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన ఒక…
Srushti Testtube Baby Centre: సికింద్రబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. చట్టవ్యతిరేక సరోగసి విధానాలు, పిల్లల అక్రమ విక్రయం వంటి అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన పాత్రధారిగా మారగా, ఆమె ఆధ్వర్యంలో సరోగసి కోసం వచ్చిన దంపతులకు వేరే పిల్లలను ఇవ్వడానికి ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత గోపాలపురంలోని ఓ జంట…
Baby Sale : నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా పుట్టిన పసికందును అమ్మేందుకు ఓ తల్లి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. డబ్బుల విషయంలో చోటుచేసుకున్న గొడవతో ఈ అంశం బయటపడటంతో పోలీసులు విచారణ ప్రారంభించి కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓ మహిళ తన appena పుట్టిన శిశువును పులాంగ్కు చెందిన ఓ దంపతులకు విక్రయించింది. ఈ…
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఈ ముఠాలో…