Srinivas Goud: కిషన్ రెడ్డి బహిరంగంగా కవితకు క్షమాపణలు చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud Demands Kishan Reddy To Say Sorry To Kavitha: ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ అడిగిన ఫోన్లను కవిత విచారణకు తీసుకెళ్లారని.. ఇప్పుడు కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని.. ఇందుకు ఆయన బహిరంగంగా కవితమ్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మహిళలను గౌరవిస్తాం అని గొప్పలు చెప్తారు.. మరి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతారు?’’ అని నిలదీశారు. ‘మతి ఉండి మాట్లాడుతున్నారా.. లేక భ్రమించి మాట్లాడుతున్నారా’ అని ఫైర్ అయ్యారు.
Amritpal Singh: 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
ఒక ఆడబిడ్డను లేని పోని మాటలతో కించపరిచారని.. మహిళ గోప్యత, ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. విచారణకు ముందే, ఫోన్ల విషయం ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని.. అడ బిడ్డపై ప్రతాపం చూపెడతారా? అంటూ ధ్వజమెత్తారు. వేల కోట్లు ఎగవేసిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా, అదానీలు ఎక్కడ వెళ్లారని.. వాళ్ల స్కాంలపై విచారణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీ మిత్రులను వదిలేసి.. తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళను వదిలేశారని ఆరోపించారు. ఆడపిల్ల అని కనికరం లేకుండా.. గంటలు గంటలుగా విచారణ జరిపారని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకున్నా.. తప్పుడు ఆధారాలు సృష్టించి, అప్రతిష్ట పాలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఉగాది పండుగ ఉందనే కనికరం కూడా లేదని.. మీకు తగిన శాస్తి, పాపం తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారని.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించాలని కోరారు. కవితను కేసుల పేరుతో వేధిస్తున్నారన్న ఆయన.. తాము బెదిరింపులకు ఏమాత్రం భయపడమని తెగేసి చెప్పారు.
తాజావార్తలు
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..