Srinivas Goud: కిషన్ రెడ్డి బహిరంగంగా కవితకు క్షమాపణలు చెప్పాలి
Srinivas Goud Demands Kishan Reddy To Say Sorry To Kavitha: ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ అడిగిన ఫోన్లను కవిత విచారణకు తీసుకెళ్లారని.. ఇప్పుడు కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని.. ఇందుకు ఆయన బహిరంగంగా కవితమ్మకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మహిళలను గౌరవిస్తాం అని గొప్పలు చెప్తారు.. మరి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతారు?’’ అని నిలదీశారు. ‘మతి ఉండి మాట్లాడుతున్నారా.. లేక భ్రమించి మాట్లాడుతున్నారా’ అని ఫైర్ అయ్యారు.
Amritpal Singh: 80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
ఒక ఆడబిడ్డను లేని పోని మాటలతో కించపరిచారని.. మహిళ గోప్యత, ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. విచారణకు ముందే, ఫోన్ల విషయం ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని.. అడ బిడ్డపై ప్రతాపం చూపెడతారా? అంటూ ధ్వజమెత్తారు. వేల కోట్లు ఎగవేసిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా, అదానీలు ఎక్కడ వెళ్లారని.. వాళ్ల స్కాంలపై విచారణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీ మిత్రులను వదిలేసి.. తెలంగాణ ఆడబిడ్డను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళను వదిలేశారని ఆరోపించారు. ఆడపిల్ల అని కనికరం లేకుండా.. గంటలు గంటలుగా విచారణ జరిపారని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకున్నా.. తప్పుడు ఆధారాలు సృష్టించి, అప్రతిష్ట పాలు చేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఉగాది పండుగ ఉందనే కనికరం కూడా లేదని.. మీకు తగిన శాస్తి, పాపం తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారని.. కేంద్రాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించాలని కోరారు. కవితను కేసుల పేరుతో వేధిస్తున్నారన్న ఆయన.. తాము బెదిరింపులకు ఏమాత్రం భయపడమని తెగేసి చెప్పారు.
తాజావార్తలు
-
IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?