నంగునూర్ (మం) కొనాయిపల్లిలో వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ యాదాద్రితో సహా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారని తెలిపారు. రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. దేవుళ్ళపై ప్రమాణం చేసి మాట తప్పిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మాట ఇవ్వడం.. ఇచ్చిన మాట తప్పడం సిఎం రేవంత్ కు అలవాటే అని హరీష్ రావు అన్నారు.
Also Read: GHMC: స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన కార్పొరేటర్ల నామినేషన్లు..
కాంగ్రెస్ నైజం ప్రజలకు అర్థం అయింది.. అందుకే మహారాష్ట్ర, హర్యానా, డిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దారుణంగా ఓడించారు అని పేర్కొన్నారు. ఈ రోజు ప్రామిస్ డే.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు ఈ ప్రామిస్ డే సందర్భంగా నిలబెట్టుకోవాలని సవాల్ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.