Tiger Tension in Siddipet: సిద్ధిపేట జిల్లాను ఇప్పుడు పెద్దపులి భయం వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో పశువులపై పులి దాడి చేస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వరుసగా రెండో రోజు కూడా లేగదూడలను పులి చంపి తినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి లేగదూడలపై దాడి చేసి చంపిన పులి, వాటిని భక్షించింది. కేవలం ఘనపూర్ మాత్రమే కాదు.. అంతకుముందు ధూల్మిట్ట మండలం కూటిగల్, భైరాన్పల్లితో పాటు మద్దూరు మండలం లద్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో కూడా పులి పశువులను చంపి తిన్నట్లు అధికారులు గుర్తించారు.
Mohan Bhagwat: ‘‘బంగ్లాదేశ్ హిందువులు పోరాడితే..’’ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
వరుస దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పులి పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు.. అది పెద్దపులి అని ధృవీకరించారు. పులి జాడ కోసం అధికారులు డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పొలాలకు వెళ్లే రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని గ్రామాల్లో దండోరా వేయించారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసేందుకు కూడా అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Vellampalli Srinivas: లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు వెల్లంపల్లి ఛాలెంజ్..