Vellampalli Srinivas: లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు వెల్లంపల్లి ఛాలెంజ్..
- తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
- సీబీఐ సిట్ రిపోర్టులో జంతువు కొవ్వు కలిసింది అని ఎక్కడా చెప్పలేదు..
- లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు ఛాలెంజ్: వెల్లంపల్లి
Vellampalli Srinivas: చంద్రబాబు ప్రభుత్వానికి లడ్డూ విషయంలో తప్పు చేశామని బాధ పడే పరిస్థితి కనిపించటం లేదని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అధికారంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు దేవుడి విషయంలో సిగ్గు, భయం లేకుండా మాట్లాడుతున్నారు.. గత ఏడాది సెప్టెంబరులో లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు.. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దీక్ష అంటూ నానా యాగీ చేశారు.. సీబీఐ సిట్ ఎక్కడా యానిమల్ ఫ్యాట్ ఆనవాళ్లు లేవని రిపోర్ట్ ఇచ్చింది.. అయినా ఇప్పటికీ వాళ్ళు రిపోర్ట్ పై బుకాయిస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు లడ్డూలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని నిరూపించగలరా అని కూటమి నేతలకు మాజీమంత్రి వెల్లంపల్లి సవాల్ విసిరారు.
Read Also: Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
Also Read
అయితే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేనప్పుడు, పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైతే డైవర్షన్స్ చేయటం చంద్రబాబుకు అలవాటేనని శ్రీనివాసరావు తెలిపారు. ఈ మధ్య చంద్రబాబు, పవన్, మాధవ్, మంత్రులు కూర్చున్నారు.. వాళ్లలో తప్పుచేసిన భావన స్పష్టంగా కనిపించింది.. వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారాలు చేయడం మంచిది కాదు.. సీబీఐ సిట్ లో కూడా ఇద్దరు మీరు నియమించిన అధికారులే ఉన్నారు.. అయినా ఛార్జ్ షీట్ లో యానిమల్ ఫ్యాట్ లేదని క్లారిటీ ఇచ్చింది.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
ఇక, యానిమల్ ఫ్యాట్స్ అంటే భక్తులు నమ్మటం లేదని బాత్ రూంలు కలిసే యాసిడ్స్ కలిపారని కొత్త నాటకానికి తెరతీశారని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అసలు తినే పదార్థాల్లో యాసిడ్స్ వేసుకుని తింటే ఎమవుతుందో మీరు కలుపుకుని చూస్తే అర్ధం అవుతుంది.. కొంత మంది జోకర్లు హిందూ ధర్మాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు.. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే లారీలు వచ్చాయి.. రిటర్న్ అయ్యాయి.. మల్లే అవే ట్యాంకర్లు లోపలికి వెళ్ళాయి.. దీనికి సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నించాడు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యతపై ఒక్క ఫిర్యాదు అయినా వచ్చిందా.. మీ ప్రభుత్వం వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరిగాయి.. అయోధ్యకు లక్ష లడ్లు పంపించి కల్తీ లడ్లూ తినిపించారని ఊగిపోతూ మాట్లాడిన పవన్.. అసలు ఆ లడ్డూలు ఎవరు తయారు చేయించారో అనే సమాచారం కూడా లేకుండా మాట్లాడి అపహాస్యం పాలయ్యారు.. రోజుకో రకంగా మాట్లాడే పవన్, నాగబాబును ఎవరు పట్టించుకోవటం లేదని శ్రీనివాసరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!