Hyderabad Metro: ఎయిర్పోర్ట్ మెట్రోపై అప్డేట్.. వచ్చే వారం పనులు ప్రారంభమయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: విశ్వనగరంలో ఇప్పటికే కొత్త ఫ్లై ఓవర్లు, వంతెనలు, రోడ్లు నిర్మించారు. అదే సమయంలో, పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా ప్రజా రవాణాను ఊహించని విధంగా మెరుగుపరచాలని నిర్ణయించింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రోను పొడిగిస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులో ఉండగా.. ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ దశలో ఉంది. విమానాశ్రయం మెట్రో రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ. గతేడాది డిసెంబర్లో ఈ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.6250 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో పనులకు ఈపీసీ పద్ధతిలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించారు. రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేయగా ఎల్1గా నిలిచిన కంపెనీ వివరాలతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ఆమోదం అనంతరం టెండర్లు వేసిన కంపెనీ ఎయిర్పోర్టు మెట్రో పనులు చేపడుతుంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్రం నుంచి కూడా సూత్రప్రాయ ఆమోదం అవసరం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Read also: Fair Accident: రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం.. వారంలో ఇది రెండోసారి
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
టెండర్ దక్కించుకున్న కంపెనీని రెండు మూడు రోజుల్లో ప్రకటించి వచ్చే వారం క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లోనే ఎక్స్ప్రెస్ మెట్రో డిపోను నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన 48 ఎకరాలను జీఎంఆర్ తాజాగా మెట్రో రైలుకు అప్పగించింది. ముందుగా సెప్టెంబర్ 13ని డెడ్లైన్గా నిర్ణయించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ముగియడంతో ఈ తొలిదశ పనులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమైన సైక్లింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం, ఎయిర్పోర్టు మెట్రో పనుల ప్రారంభోత్సవం ఈ నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయంతో నగరానికి మెట్రో కనెక్టివిటీ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని గతంలో ఆయన సూచించారు. ఈ మేరకు 2018-19లో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) డీపీఆర్ను రూపొందించింది. ఆ తర్వాత రెండేళ్లకు ఆమోదించిన ప్రభుత్వం… గతేడాది డిసెంబర్ లో శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
TS Rains: తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు
తాజావార్తలు
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?