PM Modi Hyderabad tour: మోడీ వేదిక పై ఆ ఇద్దరికీ సీట్లు.. వాళ్ళు వెళతారా మరి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Hyderabad tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి వర్చువల్గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
కానీ మోడీ అధికారిక పర్యటన కావడంతో పరేడ్ గ్రౌండ్లో ఆయన పాల్గొనే బహిరంగ సభకు ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురికి ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (స్థానిక ఎంపీ)తో పాటు మరికొంత మందిని వేదికపై కూర్చోబెట్టారు. కాగా, అధికారిక పర్యటన సందర్భంగా కేసీఆర్కు ప్రధాని మోదీ ఆహ్వానం పంపారు. అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ వేదికపై మాట్లాడేందుకు సమయం కేటాయించారు.
Also Read
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
- Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానిస్తున్న మంత్రిగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. దీంతో బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలకనున్నారు. అలాగే తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలుకుతారు. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ మీటింగ్ కు కేసీఆర్ దూరంగా ఉంటారని బీఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే సభా వేదికపై ప్రొటోకాల్ ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
IPL 2023 : నువ్వా నేనా చూసుకుందాం.. చెన్నైతో ముంబై ఢీ
తాజావార్తలు
-
Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
-
Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!