Seasonal Diseases: వాతావరణంలో మార్పులు.. రాష్ట్రంలో రోజోరోజుకు పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seasonal Diseases: వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులు కిక్కిరిసిపోతున్నారు. కొద్దిరోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి, ఆ తర్వాత వర్షం ఆగింది. ఈ కారణంగా వాతావరణంలో మార్పులతో దోమలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది. సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read also: INDIA Alliance: మోడీపై సమిష్టిపోరుకు సమాయత్తం..నేడు “లోగో” ఆవిష్కరణ
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
మరోవైపు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి జ్వరపీడితులతో కిక్కిరిసిపోయింది. ఆసుపత్రిలోని 500 పడకలు పూర్తిగా రోగులతో నిండిపోయాయి. రోగులు ఎక్కువగా రావడంతో జ్వరం తగ్గకముందే కొందరిని డిశ్చార్జి చేయాల్సి వస్తుంది. వందల సంఖ్యలో వైరల్ ఫీవర్లు పుట్టుకొస్తున్నాయి. కరీంనగర్ పరిధిలోని కొత్తపల్లి, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, ఇల్లందకుంట, మానకొండూర్, హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో డెంగ్యూ జ్వరాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎవరిని పలకరించినా ప్లేట్ లెట్స్ తగ్గాయని అంటున్నారు. వాతావరణంలో మార్పులు, పరిశుభ్రత లోపించడంతో జ్వరాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 40 మంది వచ్చేవారు.. ఇప్పుడు ఆ సంఖ్య 150కి చేరడంతో వాంతులు, విరేచనాల కేసులు పెరిగాయి. పడకలు సరిపోకపోతే అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎంత మంది వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. డెంగ్యూ నిర్ధారణ అయిన ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ చర్యలు చేపట్టి వ్యాప్తి చెందకుండా రక్తనమూన సేకరణ చేపట్టాలన్నారు.
Success Story: ఉద్యోగాన్ని వదిలి.. భూమిని నమ్మాడు.. రూ.కోటి సంపాదిస్తున్నాడు
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!