Seasonal Diseases: వాతావరణంలో మార్పులు.. రాష్ట్రంలో రోజోరోజుకు పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seasonal Diseases: వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులు కిక్కిరిసిపోతున్నారు. కొద్దిరోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి, ఆ తర్వాత వర్షం ఆగింది. ఈ కారణంగా వాతావరణంలో మార్పులతో దోమలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది. సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read also: INDIA Alliance: మోడీపై సమిష్టిపోరుకు సమాయత్తం..నేడు “లోగో” ఆవిష్కరణ
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
మరోవైపు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి జ్వరపీడితులతో కిక్కిరిసిపోయింది. ఆసుపత్రిలోని 500 పడకలు పూర్తిగా రోగులతో నిండిపోయాయి. రోగులు ఎక్కువగా రావడంతో జ్వరం తగ్గకముందే కొందరిని డిశ్చార్జి చేయాల్సి వస్తుంది. వందల సంఖ్యలో వైరల్ ఫీవర్లు పుట్టుకొస్తున్నాయి. కరీంనగర్ పరిధిలోని కొత్తపల్లి, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, ఇల్లందకుంట, మానకొండూర్, హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో డెంగ్యూ జ్వరాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎవరిని పలకరించినా ప్లేట్ లెట్స్ తగ్గాయని అంటున్నారు. వాతావరణంలో మార్పులు, పరిశుభ్రత లోపించడంతో జ్వరాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 40 మంది వచ్చేవారు.. ఇప్పుడు ఆ సంఖ్య 150కి చేరడంతో వాంతులు, విరేచనాల కేసులు పెరిగాయి. పడకలు సరిపోకపోతే అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎంత మంది వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. డెంగ్యూ నిర్ధారణ అయిన ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ చర్యలు చేపట్టి వ్యాప్తి చెందకుండా రక్తనమూన సేకరణ చేపట్టాలన్నారు.
Success Story: ఉద్యోగాన్ని వదిలి.. భూమిని నమ్మాడు.. రూ.కోటి సంపాదిస్తున్నాడు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!