Jubilee Hills Pub Gang Case: రెండోరోజు కీలకంగా మారిన సాదుద్దీన్ కస్టడీ విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో కస్టడీ విచారణ లో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించిన ఏ 1 నిందితుడు సాదుద్దీన్, మొదటిరోజు 6 గంటలు పాటు పోలీసులు విచారణ చేసారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణలో వెల్లడించిన స్టేట్మెంట్ నేడు కీలకంగా మారనుంది. మే 28న ఘటన జరిగిన అనంతరం ఆ మరుసటి రోజు ఏం జరిగిందన్న దానిపై పోలీసుల అరా తీస్తున్నారు.
సాదుద్దీన్ విచారణలో వెల్లడి:
మే 28 న అనుమానం వచ్చి అదే రోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో నిందితులను కలిసేందుకు హాది, వారి స్నేహితులు వచ్చినట్లు మాలిక్ విచారణలో వెల్లడించాడు. హాది , మైనర్ బాలిక మధ్య వాగ్వాడం జరిగిందని తెలిపాడు. పోలీస్ కంప్లయింట్ ఇస్తా అని చెప్పగా మమ్మల్ని ఏం చేయలేరంటూ మా వెనుక పొలిటికల్ పవర్ ఉందంటు మైనర్ లు సమాధానం ఇచ్చారంటు మాలిక్ వెల్లడించారు. వాగ్వాదం అనంతరం ఎవరి ఇంటికి వాళ్లు వెళ్ళిపోయామన్నాడు. మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని తెలియగానే అందరం ఎక్కడివారు అక్కడి నుండి ఎస్కేప్ అయ్యామని మాలిక్ తెలిపాడు. ఇవాళ రెండవ రోజు సాదుద్దీన్ మాలిక్ ను ఐ.ఓ. బంజారాహిల్స్ ఏసిపి సుదర్శన్ విచారణ జరపనున్నట్లు తెలిపారు.
Also Read
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టిన నిందితులు:
అత్యాచారం చేసిన తరువాత నిందితులు మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు నిందితులు. మే 31 వరకు వెయిట్ చేసిన నిందితులు, 31 న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే ముగ్గురు నిందితులు సిటీ వదిలి వెళ్లిపోయారు.
బంజారాహిల్స్ లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడుకు పరార్ అయ్యాడు. మరో నిందితుడు గోవా కు పరారీ కాగా.. ఇంకో నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ కి పరారీ అయ్యాడు. నిందితులు తమ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయడం తో నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఏపీ, తమిళ నాడు, గోవా లకు స్పెషల్ టీమ్స్ తో జెల్లెడ పట్టి.. ఎట్టకేలకు 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు.
గ్యాంగ్ రేప్ కేస్ లో నేడు మైనార్ల విచారణ :
A2 A3 A4 లను విచారించేందుకు జువైనల్ కోర్ట్ అనుమతించింది. ఐదు రోజుల పాటు మైనర్లు పోలీస్ కస్టడీలో వున్నారు. జువైనైల్ హోం లో నే వారిని విచారించే అవకాశం వుంది. ఇప్పటికే సాద్ధిదీన్ మాలిక్ ను విచారిస్తున్న పోలీసులు.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సాదుద్దీన్ మాలిక్ ను ఈరోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
-
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!