Jubilee Hills Pub Gang Case: రెండోరోజు కీలకంగా మారిన సాదుద్దీన్ కస్టడీ విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో కస్టడీ విచారణ లో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించిన ఏ 1 నిందితుడు సాదుద్దీన్, మొదటిరోజు 6 గంటలు పాటు పోలీసులు విచారణ చేసారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణలో వెల్లడించిన స్టేట్మెంట్ నేడు కీలకంగా మారనుంది. మే 28న ఘటన జరిగిన అనంతరం ఆ మరుసటి రోజు ఏం జరిగిందన్న దానిపై పోలీసుల అరా తీస్తున్నారు.
సాదుద్దీన్ విచారణలో వెల్లడి:
మే 28 న అనుమానం వచ్చి అదే రోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో నిందితులను కలిసేందుకు హాది, వారి స్నేహితులు వచ్చినట్లు మాలిక్ విచారణలో వెల్లడించాడు. హాది , మైనర్ బాలిక మధ్య వాగ్వాడం జరిగిందని తెలిపాడు. పోలీస్ కంప్లయింట్ ఇస్తా అని చెప్పగా మమ్మల్ని ఏం చేయలేరంటూ మా వెనుక పొలిటికల్ పవర్ ఉందంటు మైనర్ లు సమాధానం ఇచ్చారంటు మాలిక్ వెల్లడించారు. వాగ్వాదం అనంతరం ఎవరి ఇంటికి వాళ్లు వెళ్ళిపోయామన్నాడు. మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని తెలియగానే అందరం ఎక్కడివారు అక్కడి నుండి ఎస్కేప్ అయ్యామని మాలిక్ తెలిపాడు. ఇవాళ రెండవ రోజు సాదుద్దీన్ మాలిక్ ను ఐ.ఓ. బంజారాహిల్స్ ఏసిపి సుదర్శన్ విచారణ జరపనున్నట్లు తెలిపారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టిన నిందితులు:
అత్యాచారం చేసిన తరువాత నిందితులు మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీ పై ఫోకస్ పెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు నిందితులు. మే 31 వరకు వెయిట్ చేసిన నిందితులు, 31 న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగానే ముగ్గురు నిందితులు సిటీ వదిలి వెళ్లిపోయారు.
బంజారాహిల్స్ లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడుకు పరార్ అయ్యాడు. మరో నిందితుడు గోవా కు పరారీ కాగా.. ఇంకో నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ కి పరారీ అయ్యాడు. నిందితులు తమ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయడం తో నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఏపీ, తమిళ నాడు, గోవా లకు స్పెషల్ టీమ్స్ తో జెల్లెడ పట్టి.. ఎట్టకేలకు 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు.
గ్యాంగ్ రేప్ కేస్ లో నేడు మైనార్ల విచారణ :
A2 A3 A4 లను విచారించేందుకు జువైనల్ కోర్ట్ అనుమతించింది. ఐదు రోజుల పాటు మైనర్లు పోలీస్ కస్టడీలో వున్నారు. జువైనైల్ హోం లో నే వారిని విచారించే అవకాశం వుంది. ఇప్పటికే సాద్ధిదీన్ మాలిక్ ను విచారిస్తున్న పోలీసులు.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సాదుద్దీన్ మాలిక్ ను ఈరోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!