RUBY Hotel Fire Accident Update: సికింద్రాబాద్ ఫైర్ ఆక్సిడెంట్.. పోలీస్ నివేదికలో కీలకాంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ ఫైర్ ఆక్సిడెంట్ పై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. 11 మందికి గాయాలయ్యాయి. ఏడుగురు రూబీ హోటల్ నుండి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సహాయంతో 17 మందిని కాపాడారు ఫైర్ సిబ్బంది. హాస్పిటల్లో ఉన్నవారికి ఇంటర్నల్ గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు.
ఈ ప్రమాద సమయంలో సెల్లార్లో 28 ఎలక్ట్రిక్ బైకులు,8 పెట్రోల్ బైక్ లు వున్నట్టుగా తెలుస్తోంది. అదే సెల్లార్లో జనరేటర్లతోపాటు ఓపెన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో బైకులు, జనరేటర్, బ్యాటరీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మంటలు అంటుకున్న కాసేపట్లోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. సీసీ టీవీ ఫుటేజ్ లో అనేక అంశాలు బయటపడ్డాయి. వీటితోపాటు నాలుగు హెచ్ పి సిలిండర్లు లీకేజ్ కండిషన్లో ఉన్నాయి. బిల్డింగ్ రూఫ్ టాప్ పైన కిచెన్ సదుపాయం వుంది.
Also Read
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
Read Also: Ruby Hotel Fire Accident: రూబీ హోటల్ విషాదం..ఫైర్ డిపార్ట్ మెంట్ నివేదికలో ఏముందంటే?
ఈఘటనపై 304(2), 324 , ఎక్స్ ప్లోసివ్ యాక్ట్ సెక్షన్ 9 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 8 మృతదేహాలకు గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయింది. వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. నిందితులు రంజిత్ సింగ్, సునీత్ , సుదర్శన్ నాయుడు, జస్పాల్ సింగ్ లను అరెస్టు చేశారు. పరారీలో సుప్రీత్ సింగ్ వున్నట్టు పోలీసులు తెలిపారు. రూబీ హోటల్ బిల్డింగ్ రంజిత్ సింగ్ పేరు మీద ఉంది.
రంజిత్ సింగ్ కుమారులు సునీల్ సింగ్ సుప్రీత్ సింగ్. బైక్ చార్జ్ అవుతున్న క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఎఫ్ఎస్ఎల్ నుండి పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని, వచ్చాకే కీలక అంశాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. బ్యాటరీ చార్జింగ్ బైక్స్ బిజినెస్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ను నిందితులు పాటించలేదని తెలుస్తోంది. నిందితుల కారణంగానే ఇంత భారీ ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ పార్కింగ్ ప్లేస్ ని దుర్వినియోగం చేసి చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం జరిగింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!