RUBY Hotel Fire Accident Update: సికింద్రాబాద్ ఫైర్ ఆక్సిడెంట్.. పోలీస్ నివేదికలో కీలకాంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ ఫైర్ ఆక్సిడెంట్ పై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. 11 మందికి గాయాలయ్యాయి. ఏడుగురు రూబీ హోటల్ నుండి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సహాయంతో 17 మందిని కాపాడారు ఫైర్ సిబ్బంది. హాస్పిటల్లో ఉన్నవారికి ఇంటర్నల్ గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు.
ఈ ప్రమాద సమయంలో సెల్లార్లో 28 ఎలక్ట్రిక్ బైకులు,8 పెట్రోల్ బైక్ లు వున్నట్టుగా తెలుస్తోంది. అదే సెల్లార్లో జనరేటర్లతోపాటు ఓపెన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో బైకులు, జనరేటర్, బ్యాటరీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మంటలు అంటుకున్న కాసేపట్లోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. సీసీ టీవీ ఫుటేజ్ లో అనేక అంశాలు బయటపడ్డాయి. వీటితోపాటు నాలుగు హెచ్ పి సిలిండర్లు లీకేజ్ కండిషన్లో ఉన్నాయి. బిల్డింగ్ రూఫ్ టాప్ పైన కిచెన్ సదుపాయం వుంది.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
Read Also: Ruby Hotel Fire Accident: రూబీ హోటల్ విషాదం..ఫైర్ డిపార్ట్ మెంట్ నివేదికలో ఏముందంటే?
ఈఘటనపై 304(2), 324 , ఎక్స్ ప్లోసివ్ యాక్ట్ సెక్షన్ 9 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 8 మృతదేహాలకు గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయింది. వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. నిందితులు రంజిత్ సింగ్, సునీత్ , సుదర్శన్ నాయుడు, జస్పాల్ సింగ్ లను అరెస్టు చేశారు. పరారీలో సుప్రీత్ సింగ్ వున్నట్టు పోలీసులు తెలిపారు. రూబీ హోటల్ బిల్డింగ్ రంజిత్ సింగ్ పేరు మీద ఉంది.
రంజిత్ సింగ్ కుమారులు సునీల్ సింగ్ సుప్రీత్ సింగ్. బైక్ చార్జ్ అవుతున్న క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఎఫ్ఎస్ఎల్ నుండి పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని, వచ్చాకే కీలక అంశాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. బ్యాటరీ చార్జింగ్ బైక్స్ బిజినెస్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ను నిందితులు పాటించలేదని తెలుస్తోంది. నిందితుల కారణంగానే ఇంత భారీ ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ పార్కింగ్ ప్లేస్ ని దుర్వినియోగం చేసి చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం జరిగింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!