Robberies: వరుస దొంగతనాలతో జనం టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస దొంగతనాలు జనం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు…తాళం వేసి ఎటైనా బయటకు వెళ్లారా? అంతే సంగతులు. ఆ ఇంటికి కన్నం వేసేస్తున్నారు.వారం రోజుల్లో ఆరు చోట్ల వరుస దొంగతనాలు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం… బొగ్గు గనులతో విరాజిల్లుతోంది. ఎక్కువగా సింగరేణి, జెన్కో కార్మికులే ఎక్కువ. వాణిజ్య,వ్యాపార పరంగానూ అభివృద్ది చెందుతోంది.జిల్లా కేంద్రంగా మారడంతో భూపాలపల్లిలో జిల్లా ఎస్పీ నుంచి అనేక మంది పోలీస్ అధికారుల పాలన జరుగుతోంది.
పటిష్టమైన బందోబస్తు .. కానీ దొంగ తనాలు మాత్రం ఆగడంలేదు. పగలు,రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు.వరుస దొంగతనాలు జనం ఆందోళనకు గురవుతున్నారు. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఎదైనా ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో వస్తువులు దోపిడీకి గురవుతున్నాయి. ఇలా వరుస దొంగతనాలతో జనం ఊరెళ్లాలన్నా భయపడిపోతున్నారు.
Also Read
- Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
- Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
- Bhatti Vikramarka : ఆలయాల అభివృద్ధికి రూ. 2,216 కోట్లు.. భట్టి కీలక ప్రకటన
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
పట్టణంలో గత వారం రోజుల్లోనే ఆరు ఇళ్లల్లో దోపిడీ చేశారు.ఈనెల 3వ తేదీన ఒకే రోజు ఎల్బీ నగర్ లో శ్రీనివాస్,రమేష్ రెండు ఇళ్ళలో చోరీ చేశారు. 6తులాల బంగారం, 50వేల నగదు దోపిడీ చేశారు. అలాగే కృష్ణ కాలనీ,జవహర్ లాల్ కాలనీలో మూడు ఇళ్ళలో దొంగతనాలు జరగగా.. సుమారు 8తులాల బంగారం, వెండి, 2లక్షల రూపాయలు నగదు చోరీ అయ్యాయి.
వాయిస్ ఓవర్: ఇలా పలు ఇళ్ళలో చొరబడి అందిన కాడికి దోచుకెళ్లాతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సరైన భద్రత కల్పించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలు లాంటి వీవీఐపీల తప్ప సామాన్యులను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై ఎల్ బి నగర్ కాలనీ వాసులు వినూత్న రీతిలో రోడ్డుపై నిరసన చేసిన తీరు ఇక్కడ తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇప్పటికైనా పోలీసులు దోపిడీలకు అడ్డుకట్ట వేసే విధంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని, దొంగలను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలనీల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు, పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ సార్లు కాలనీల్లో నిర్వహించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!