Robberies: వరుస దొంగతనాలతో జనం టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస దొంగతనాలు జనం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు…తాళం వేసి ఎటైనా బయటకు వెళ్లారా? అంతే సంగతులు. ఆ ఇంటికి కన్నం వేసేస్తున్నారు.వారం రోజుల్లో ఆరు చోట్ల వరుస దొంగతనాలు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం… బొగ్గు గనులతో విరాజిల్లుతోంది. ఎక్కువగా సింగరేణి, జెన్కో కార్మికులే ఎక్కువ. వాణిజ్య,వ్యాపార పరంగానూ అభివృద్ది చెందుతోంది.జిల్లా కేంద్రంగా మారడంతో భూపాలపల్లిలో జిల్లా ఎస్పీ నుంచి అనేక మంది పోలీస్ అధికారుల పాలన జరుగుతోంది.
పటిష్టమైన బందోబస్తు .. కానీ దొంగ తనాలు మాత్రం ఆగడంలేదు. పగలు,రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు.వరుస దొంగతనాలు జనం ఆందోళనకు గురవుతున్నారు. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఎదైనా ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో వస్తువులు దోపిడీకి గురవుతున్నాయి. ఇలా వరుస దొంగతనాలతో జనం ఊరెళ్లాలన్నా భయపడిపోతున్నారు.
Also Read
పట్టణంలో గత వారం రోజుల్లోనే ఆరు ఇళ్లల్లో దోపిడీ చేశారు.ఈనెల 3వ తేదీన ఒకే రోజు ఎల్బీ నగర్ లో శ్రీనివాస్,రమేష్ రెండు ఇళ్ళలో చోరీ చేశారు. 6తులాల బంగారం, 50వేల నగదు దోపిడీ చేశారు. అలాగే కృష్ణ కాలనీ,జవహర్ లాల్ కాలనీలో మూడు ఇళ్ళలో దొంగతనాలు జరగగా.. సుమారు 8తులాల బంగారం, వెండి, 2లక్షల రూపాయలు నగదు చోరీ అయ్యాయి.
వాయిస్ ఓవర్: ఇలా పలు ఇళ్ళలో చొరబడి అందిన కాడికి దోచుకెళ్లాతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సరైన భద్రత కల్పించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలు లాంటి వీవీఐపీల తప్ప సామాన్యులను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై ఎల్ బి నగర్ కాలనీ వాసులు వినూత్న రీతిలో రోడ్డుపై నిరసన చేసిన తీరు ఇక్కడ తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇప్పటికైనా పోలీసులు దోపిడీలకు అడ్డుకట్ట వేసే విధంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని, దొంగలను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలనీల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు, పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ సార్లు కాలనీల్లో నిర్వహించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!