Revanth reddy: సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లపై ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా నెహ్రూ తీసుకువచ్చిన పేపర్ పై బీజేపీ ఈడీతో దాడులు చేయిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కీసర వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఈడీ నోటీసులపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది నీచమైన ప్రతీకార రాజకీయాలకు ఉదాహరణ అని.. దీన్ని ఖండిస్తున్నానని.. మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఉండీ, ఎంపీలు ఉన్నప్పటీకి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోందని.. వారు తమ పాలనను కాపాడుకోవడానికి ఈడీపై ఆధారపడుతున్నారని.. తిరిగి పోరాడుతాం’’ అంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
2013లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసు కొనసాగుతోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈడీ సమన్లతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశం అయింది. తాజాగా సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు రావడంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇంతకుముందు కాంగ్రెస్ నేత ఎంపీ మల్లిఖార్జున ఖర్గేను కూడా ఈడీ విచారించింది.
ED notice to @INCIndia top leadership is an example of worst kind of vendetta politics & highly condemnable.
With maximum number of MP’s & Govts in the states…BJP is still so afraid that they are depending on ED to secure their regime.
We will fight back…#सत्य_नहीं_झुकेगा
— Revanth Reddy (@revanth_anumula) June 1, 2022
తాజావార్తలు
-
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..