Revanth reddy: సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లపై ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా నెహ్రూ తీసుకువచ్చిన పేపర్ పై బీజేపీ ఈడీతో దాడులు చేయిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కీసర వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఈడీ నోటీసులపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది నీచమైన ప్రతీకార రాజకీయాలకు ఉదాహరణ అని.. దీన్ని ఖండిస్తున్నానని.. మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఉండీ, ఎంపీలు ఉన్నప్పటీకి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోందని.. వారు తమ పాలనను కాపాడుకోవడానికి ఈడీపై ఆధారపడుతున్నారని.. తిరిగి పోరాడుతాం’’ అంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
Also Read
2013లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసు కొనసాగుతోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈడీ సమన్లతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశం అయింది. తాజాగా సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు రావడంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇంతకుముందు కాంగ్రెస్ నేత ఎంపీ మల్లిఖార్జున ఖర్గేను కూడా ఈడీ విచారించింది.
ED notice to @INCIndia top leadership is an example of worst kind of vendetta politics & highly condemnable.
With maximum number of MP’s & Govts in the states…BJP is still so afraid that they are depending on ED to secure their regime.
We will fight back…#सत्य_नहीं_झुकेगा
— Revanth Reddy (@revanth_anumula) June 1, 2022
తాజావార్తలు
-
Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!