Revanth reddy: సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లపై ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా నెహ్రూ తీసుకువచ్చిన పేపర్ పై బీజేపీ ఈడీతో దాడులు చేయిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కీసర వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఈడీ నోటీసులపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది నీచమైన ప్రతీకార రాజకీయాలకు ఉదాహరణ అని.. దీన్ని ఖండిస్తున్నానని.. మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఉండీ, ఎంపీలు ఉన్నప్పటీకి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోందని.. వారు తమ పాలనను కాపాడుకోవడానికి ఈడీపై ఆధారపడుతున్నారని.. తిరిగి పోరాడుతాం’’ అంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
2013లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసు కొనసాగుతోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈడీ సమన్లతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశం అయింది. తాజాగా సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు రావడంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇంతకుముందు కాంగ్రెస్ నేత ఎంపీ మల్లిఖార్జున ఖర్గేను కూడా ఈడీ విచారించింది.
ED notice to @INCIndia top leadership is an example of worst kind of vendetta politics & highly condemnable.
With maximum number of MP’s & Govts in the states…BJP is still so afraid that they are depending on ED to secure their regime.
We will fight back…#सत्य_नहीं_झुकेगा
— Revanth Reddy (@revanth_anumula) June 1, 2022
తాజావార్తలు
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!