Revanth Reddy: కేసీఆర్-పీకే భేటీపై రేవంత్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. ఈ సమావేశంపై అనేక విధాలుగా ప్రచారం సాగుతోంది.. అయితే, పీకే-కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్తో జట్టు కట్టేది లేదని స్పష్టత ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఓ విషపు నాగు లాంటోడు.. పాలు పోసినోడినే కాటేస్తాడని కామెంట్ చేశారు రేవంత్.
Read Also: BJP: బండి సంజయ్ పాదయాత్ర వాయిదాపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
పీకేపై విచిత్ర ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు రేవంత్రెడ్డి.. పీకే… సోనియా గాంధీతో జరిగిన చర్చలో పాల్గొన్నారని.. కాంగ్రెస్ పార్టీతో పని చేసేందుకు పీకే ఆసక్తి చూపుతున్నారన్న ఆయన.. ఈ విషయంపై కాంగ్రెస్ ఓ కమిటీ వేసింది.. పీకే, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఏ రాష్ట్రంలో మోడీతో జట్టుకట్టిన పార్టీలను, ప్రాంతీయ పార్టీలతో ఉన్న వ్యాపార ఒప్పందాలు వదులుకోవాలని చెప్పారన్నారు.. ఇక, కేసీఆర్-పీకే భేటీపై స్పందిస్తూ.. టీఆర్ఎస్తో చేసుకున్న అవగాహన నుంచి తప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారని.. టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఉంటే మేం పార్టీలో చేర్చుకోమని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టిందన్నారు రేవంత్రెడ్డి.. మరోవైపు, కేసీఆర్తో నడిచే ఎవరిని కూడా మేం దగ్గరకు రానివ్వమని.. తెలంగాణలో గుండుకు, అరగుండు ఏమి ఉంది? అంటూ బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు.. సర్వేల్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్తో కాంగ్రెస్కు పట్టున్న జిల్లాల్లో బండి సంజయ్ తిరుగుతున్నాడు అని ఆరోపించారు… కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో బండి సంజయ్ సభలు పెట్టిండు.. అక్కడ జనం లేక సభలు వెలవెల బోవడం దేనికి సంకేతమో జనం తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు రేవంత్రెడ్డి.
తాజావార్తలు
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!