Revanth Reddy: కేసీఆర్-పీకే భేటీపై రేవంత్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. ఈ సమావేశంపై అనేక విధాలుగా ప్రచారం సాగుతోంది.. అయితే, పీకే-కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్తో జట్టు కట్టేది లేదని స్పష్టత ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఓ విషపు నాగు లాంటోడు.. పాలు పోసినోడినే కాటేస్తాడని కామెంట్ చేశారు రేవంత్.
Read Also: BJP: బండి సంజయ్ పాదయాత్ర వాయిదాపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
పీకేపై విచిత్ర ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు రేవంత్రెడ్డి.. పీకే… సోనియా గాంధీతో జరిగిన చర్చలో పాల్గొన్నారని.. కాంగ్రెస్ పార్టీతో పని చేసేందుకు పీకే ఆసక్తి చూపుతున్నారన్న ఆయన.. ఈ విషయంపై కాంగ్రెస్ ఓ కమిటీ వేసింది.. పీకే, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఏ రాష్ట్రంలో మోడీతో జట్టుకట్టిన పార్టీలను, ప్రాంతీయ పార్టీలతో ఉన్న వ్యాపార ఒప్పందాలు వదులుకోవాలని చెప్పారన్నారు.. ఇక, కేసీఆర్-పీకే భేటీపై స్పందిస్తూ.. టీఆర్ఎస్తో చేసుకున్న అవగాహన నుంచి తప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారని.. టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఉంటే మేం పార్టీలో చేర్చుకోమని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టిందన్నారు రేవంత్రెడ్డి.. మరోవైపు, కేసీఆర్తో నడిచే ఎవరిని కూడా మేం దగ్గరకు రానివ్వమని.. తెలంగాణలో గుండుకు, అరగుండు ఏమి ఉంది? అంటూ బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు.. సర్వేల్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్తో కాంగ్రెస్కు పట్టున్న జిల్లాల్లో బండి సంజయ్ తిరుగుతున్నాడు అని ఆరోపించారు… కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో బండి సంజయ్ సభలు పెట్టిండు.. అక్కడ జనం లేక సభలు వెలవెల బోవడం దేనికి సంకేతమో జనం తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు రేవంత్రెడ్డి.
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..