Revanth Reddy: నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన భారత్ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. రాత్రి కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో భోజనాలు చేసి బస చేశారు. ఇవాళ ఉదయం అల్పాహారం తీసుకున్నానంతరం సరంపల్లి చౌరస్తా నుంచి సరంపల్లి, చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లి మీదుగా రాజంపేట చేరుకోనున్నారు. ఉదయం 8 గంటలకు సరంపల్లి చౌరస్తాలో పాదయాత్ర ప్రారంభించి రాజంపేటలో నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకుని దేశాయి బ్రదర్స్ అతిథి గృహంలో సేదతీరనున్నారు.
Read also: PAN card-Aadhaar linking: ఆధార్కార్డు, పాన్కార్డ్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది ?
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఇక సాయంత్రం 5 గంటలకు సిరిసిల్ల రోడ్ లోని దేశాయి బీడీ అతిథి గృహం నుంచి కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్రను నిజాంసాగర్ చౌరస్తా వరకు నిర్వహించనున్నారు. అనంతరం రాజంపేట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి పాదయాత్రను కామారెడ్డి జిల్లా కేంద్రంలో సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ తన అనుచరులతో కలిసి ఏర్పాట్లను చేస్తున్నారు. రేవంత్ పాదయాత్రకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నిన్న సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ పేపర్ లీకేజ్కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తున్నారని.. రాష్ట్రంలో 1.92 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతేడాది బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టం చేసినప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచడం చేయడం లేదని మండిపడ్డారు. వందలాది మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి, మోసం చేశారని ఆరోపించారు.
Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!