Revanth Reddy: నేడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర..
Revanth Reddy: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన భారత్ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. రాత్రి కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో భోజనాలు చేసి బస చేశారు. ఇవాళ ఉదయం అల్పాహారం తీసుకున్నానంతరం సరంపల్లి చౌరస్తా నుంచి సరంపల్లి, చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లి మీదుగా రాజంపేట చేరుకోనున్నారు. ఉదయం 8 గంటలకు సరంపల్లి చౌరస్తాలో పాదయాత్ర ప్రారంభించి రాజంపేటలో నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకుని దేశాయి బ్రదర్స్ అతిథి గృహంలో సేదతీరనున్నారు.
Read also: PAN card-Aadhaar linking: ఆధార్కార్డు, పాన్కార్డ్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది ?
Also Read
ఇక సాయంత్రం 5 గంటలకు సిరిసిల్ల రోడ్ లోని దేశాయి బీడీ అతిథి గృహం నుంచి కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్రను నిజాంసాగర్ చౌరస్తా వరకు నిర్వహించనున్నారు. అనంతరం రాజంపేట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి పాదయాత్రను కామారెడ్డి జిల్లా కేంద్రంలో సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ తన అనుచరులతో కలిసి ఏర్పాట్లను చేస్తున్నారు. రేవంత్ పాదయాత్రకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నిన్న సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ పేపర్ లీకేజ్కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తున్నారని.. రాష్ట్రంలో 1.92 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతేడాది బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టం చేసినప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచడం చేయడం లేదని మండిపడ్డారు. వందలాది మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి, మోసం చేశారని ఆరోపించారు.
Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!