Revanth Reddy: గల్లీలో ఒకరు.. ఢిల్లీలో మరొకరు ధర్నా.. టీఆర్ఎస్, బీజేపీకి రైతులే ఉరేస్తారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు.. మిల్లర్ల దగ్గర ధాన్యం సేకరణ వివరాలు ఉన్నాయి.. వాళ్లకు బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. 8 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి.. 2,600 కోట్ల విలువైన బియ్యం కపించకపోతే సీబీఐ విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: RK Roja: సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. కళాకారుల సమస్యలు నాకు తెలుసు
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
ఇక, రాజకీయ ప్రయోజనాల కోసమే గల్లీలో ఒకరు.. ఢిల్లీలో ఒకరు ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్రెడ్డి.. ధాన్యం కొనాల్సింది పాకిస్థాన్ ప్రధానా? అని ప్రధాని మోడీని ప్రశ్నించిన ఆయన.. రైతుల చావుకు కారణమైన టీఆర్ఎస్ – బీజేపీని రైతులు ఉరేస్తారు! అని హెచ్చరించారు.. పంట వేయకుండా పడావు పెట్టిన ఎకరాకు 15వేల చొప్పున్న రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేవారు రేవంత్.. అవకతవకల పై విజిలెన్స్ విచారణ చేయాలన్న ఆయన.. వడ్లు- బియ్యం మాయం చేసినవాళ్లపై సీబీఐ విచారణ చేయలన్ఆరు.. సీఎం కేసీఆర్ అవినీతిపై వివరాలు ఉంటే ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.. ధాన్యం కొనుగోలు గురించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేసిందని.. బీజేపీ నేతలకు సిగ్గు లేదు – లజ్జ తప్పి మాట్లాడుతున్నారూ అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు.. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు… కేసీఆర్ మెడలు వంచి రైతులకు మద్దతుధర ఇప్పిస్తామని.. తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు అని రైతులకు సూచించారు రేవంత్రెడ్డి.
తాజావార్తలు
-
Anil Ravipudi: ఆ రేర్ ఫీట్కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్తో క్రేజీ కాంబో ఫిక్స్?
-
DMK: వెన్నుపోటుదారుడు, అతను బీజేపీకే లాభం.. రాహుల్ గాంధీపై డీఎంకే దాడి..
-
Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
-
Eknath Shinde: మహారాష్ట్రలో షిండే మరో ఎత్తుగడ.. మళ్లీ హాట్ టాఫిక్ కాబోతున్నారా?
-
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?