Revanth Reddy : ఈ మధ్య కేసీఆర్ కాంగ్రెస్ని ఫాలో అవుతున్నారు.. బీ ఫామ్ కూడా 51 మందికే ఇచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము 55 మంది టికెట్లు ఖరారు చేశామని, కేసీఆర్ కంటే నాలుగు అభ్యర్థుల ను ఎక్కువే ఇచ్చామన్నారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అయ్యింది.. అభ్యర్థులకు అభినందనలు… కేసీఆర్ తన అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారన్నారు. గతంలో కేసీఆర్ ని అందరూ అనుకరణ చేస్తున్నారు అనే వాళ్ళు. కానీ ఈ మధ్య కేసీఆర్ కాంగ్రెస్ ని ఫాలో అవుతున్నారన్నారు.
అంతేకాకుండా..’బీ ఫామ్ కూడా 51 మందికే ఇచ్చారు. మేము 55 మంది టికెట్లు ఖరారు చేశాం. కేసీఆర్ కంటే నాలుగు అభ్యర్థుల ను ఎక్కువే ఇచ్చాం. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీ లు ఇచ్చాకా.. కేసీఆర్ కనపడకుండా పోయారు. చలి జ్వరం వచ్చింది రెస్ట్ అని కేటీఆర్ చెప్పాడు. కేసీఆర్ కి శాశ్వత విశ్రాంతి అవసరం. మా మేనిఫెస్టో తో ఆగం ఐతరు అన్నాడు. మేము మహాలక్ష్మి అంటే సౌభాగ్య లక్ష్మీ అని కేసీఆర్ అన్నాడు. మేము సిలిండర్ 5 వందలు అంటే.. కేసీఆర్ 400 అన్నాడు. సారా వేలం లో పాటల పోటీ జరిగినట్టు మమ్మల్ని కాపీ కొట్టాడు. కేసీఆర్ బుర్ర కూడా కరప్ట్ అయ్యింది. కేసీఆర్ ఆలోచన సామర్థ్యం కోల్పోయారు. కేసీఆర్ స్వయం ప్రకాశి కాదు. కేసీఆర్ పరన్న జీవి. కేసీఆర్ నకలు కొట్టి మేనిఫెస్టో ఇచ్చాడు. మేము 4 వేలు పెన్షన్ ఇస్తాం అన్తే.. ఎలా సాధ్యం అన్నాడు. మరి మీరు ఎలా ఇస్తారు. కేసీఆర్ లెక్క మేము ఉత్తుత్తి హామీ ఇవ్వలేం. హామీ ఇస్తే అమలు చేస్తాం.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కి ఇది అమలు చేసే మేనిఫెస్టో నే అని స్పష్టత ఇచ్చారు కేసీఆర్. కర్ణాటక లో డబ్బులు పట్టుకుంది ఎవరివి. పోయింది ఎవడికి. అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడానికి బుర్ర ఉండాలి. సినిమాలో ఐటమ్ సాంగ్స్ కి తీసుకు వచ్చినట్టు మహారాష్ట్ర లో నుండి రోజు నలుగురిని తీసుకువచ్చి చేర్చుకున్నాడు. డబ్బులు ఇచ్చి చేర్చుకుంటుంది మీరు. డబ్బులు పంచుతుంది కాంగ్రెస్ పై brs ఆరోపణ చేస్తుంది. ఈ నెల 17 న అమర వీరుల స్థూపం దగ్గరికి రా. డబ్బులు..మందు ప్రజలకు పంచను అని ప్రమాణం చేద్దాం రా. 12 గంటలకు రండి.. ప్రమాణం చేస్తా.. ప్రభుత్త్వ ఉద్యోగులకు మొదటి తేదీ రోజు జీతం ఇవ్వు. పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వు. నవంబర్ ఒకటో తేదీన వేసి చూపించు. అప్పుడు ని మేనిఫెస్టో నమ్ముతారు జనం. కేసీఆర్ మాటలు చూస్తే ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తి కనిపించాడు. కేసీఆర్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. శేష జీవితం రెస్ట్ తీసుకోండి. ఎన్నికల బరిలోంచి తప్పుకోండి. మీ ఆరోగ్యం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిణించింది. 17 వ తేదీ అమరవీరుల స్థూపం దగ్గరకి వచ్చి ప్రమాణం చేసి..ఫార్మ్ హౌస్ కి వెళ్లి రెస్ట్ తీసుకో’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..