Revanth Reddy: తెలంగాణలో బీజేపీకి చోటు ఇవ్వవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఢిల్లీలో ఆయన మాట్లాడారు. మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి స్వాగతం పలికారు. ప్రవీణ్ రెడ్డి రావటం వల్ల హుస్నాబాద్ లో కాంగ్రెస్ మరింత బలోపేతం కానుందన్నారు. తెలంగాణా సమాజం కాంగ్రెస్ లోకి రావాలి. వరదలు వస్తే అప్రమత్తం చెయ్యాల్సిన సీఎం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాడని రేవంత్ మండిపడ్డారు. వరదలు వచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నాడు.
క్లౌడ్ బరస్ట్ అనే కామెంట్స్ అత్యత నిర్లక్ష్యమయినవి. అవినీతి పై చర్చ జరక్కుండా ఈ చర్చ తెరపైకి తెచ్చారు. పోలవరంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని సాంకేతికంగా పరిశీలించాలి. నిజమే అయితే ఇన్ని రోజులెందుకు అభ్యంతరం వెలిబుచ్చలేదు. కేసీఆర్ చెప్పింది నమ్మాలా అజయ్ చెప్పింది నమ్మాలా? సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 11 లక్షల హెక్టర్ల పంట పాడయింది. ముందు విదేశాల కుట్ర అన్నారు, ఇపుడు పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలి.
Also Read
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
రాష్ట్రంలో తలెత్తిన వరద సమస్యలపై, నష్టాలపై సంపూర్ణమయిన నివేదికను కేంద్రానికి నివేదించాలి. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వచ్చి, కేంద్రానికి నివేదించి, సహాయక చర్యలకోసం కార్యాచరణ తీసుకోవాలి. కేంద్రం నుంచి 2 వేల కోట్లు సాధించాలి. కేంద్రం ఇప్పటికి పరిశీలక బృందాలను తెలంగాణ కు పంపలేదు. 21 నుంచి తెలంగాణ లో బిజెపి కార్యక్రమాలు అంటున్నారు, ప్రజలు బీజేపీని అడ్డుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రాణాలంటే బీజేపీకి విలువ లేదు. బీజేపీని తెలంగాణకు రానిస్తే, మరింత ప్రమాదకరం అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు రేవంత్.
Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!