Revanth Reddy: తెలంగాణలో బీజేపీకి చోటు ఇవ్వవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఢిల్లీలో ఆయన మాట్లాడారు. మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి స్వాగతం పలికారు. ప్రవీణ్ రెడ్డి రావటం వల్ల హుస్నాబాద్ లో కాంగ్రెస్ మరింత బలోపేతం కానుందన్నారు. తెలంగాణా సమాజం కాంగ్రెస్ లోకి రావాలి. వరదలు వస్తే అప్రమత్తం చెయ్యాల్సిన సీఎం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాడని రేవంత్ మండిపడ్డారు. వరదలు వచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నాడు.
క్లౌడ్ బరస్ట్ అనే కామెంట్స్ అత్యత నిర్లక్ష్యమయినవి. అవినీతి పై చర్చ జరక్కుండా ఈ చర్చ తెరపైకి తెచ్చారు. పోలవరంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని సాంకేతికంగా పరిశీలించాలి. నిజమే అయితే ఇన్ని రోజులెందుకు అభ్యంతరం వెలిబుచ్చలేదు. కేసీఆర్ చెప్పింది నమ్మాలా అజయ్ చెప్పింది నమ్మాలా? సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 11 లక్షల హెక్టర్ల పంట పాడయింది. ముందు విదేశాల కుట్ర అన్నారు, ఇపుడు పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలి.
Also Read
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
రాష్ట్రంలో తలెత్తిన వరద సమస్యలపై, నష్టాలపై సంపూర్ణమయిన నివేదికను కేంద్రానికి నివేదించాలి. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వచ్చి, కేంద్రానికి నివేదించి, సహాయక చర్యలకోసం కార్యాచరణ తీసుకోవాలి. కేంద్రం నుంచి 2 వేల కోట్లు సాధించాలి. కేంద్రం ఇప్పటికి పరిశీలక బృందాలను తెలంగాణ కు పంపలేదు. 21 నుంచి తెలంగాణ లో బిజెపి కార్యక్రమాలు అంటున్నారు, ప్రజలు బీజేపీని అడ్డుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రాణాలంటే బీజేపీకి విలువ లేదు. బీజేపీని తెలంగాణకు రానిస్తే, మరింత ప్రమాదకరం అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు రేవంత్.
Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!